Saturday 25 July 2020

ధర్మసందేహాలు - మహిళలు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయకూడదంటారు... ఎందుకు?


దేవునికి సాష్టాంగ నమస్కారం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అనగా వక్షం, నుదురూ, రెండు చేతులూ, రెండు కాళ్లూ, రెండు నేత్రాలు, భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారము చెయ్యాలనుకున్నప్పుడు పొట్ట నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని పెద్దలు చెపుతారు.

No comments:

Post a Comment