Monday 21 October 2019

అతి శక్తివంతమైన సర్వ జనాకర్షణ అంజన తిలకం


27 నక్షత్రాల అందరికి ఉపయోగపడుతుంది......
మీరు చేసే వృత్తి వ్యాపారాలలో జన ఆకర్షణ పెరిగి మీరు అమ్మే వస్తువులు.. త్వరగా అమ్మకాలు జరగాలన్న ... మరియు.. చేసే ఉద్యోగంలో పై అధికారులు... నుండి ఇబ్బందులు తొలగి.. మీ క్రింది సిబ్బంది.. మీకు అనుకూలంగా మరాలన్న.... భార్య భర్తల మధ్య.. దాంపత్యం బాగుండాలి అన్న... గొడవలు లేకుండా..ప్రశాంతంగా... వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు.. సజావుగా.. సాగాలనుకునే వారికి ఈ సర్వ జన ఆకర్షణ అంజన తిలకం బాగా ఉపయోగ పడుతుంది.. ఈ అంజన తిలకం ను... ఏ విధముగా తయారీ చేయాలంటే... ఏదైనా అమావాస్య రోజున... సూర్యోదయమే నిద్ర లేచి స్నానాదులు పూర్తిచేసుకుని... సూర్యునికి నమస్కరించి.. చేదు సొరకాయ.. నుండి తీసిన తైలం(నూనెను)...సంపాదించి
ఏదైనా నూలు బట్టను.. వత్తిగా చేసి... ఎర్రని మట్టి పాత్రను ఉపయోగించి. మీ గృగం లోని..పూజ మందిరం లో ఉన్న. దుర్గ అమ్మవారి.. చిత్ర పటం దగ్గర... దీపారాధన చేయండి...
తరువాత అమ్మవారికి పూజ చేసి... ఆ తరువాత.. వెలుగుతున్న దీపం పై న 3 అంగుళాలు ఎత్తులో... ఒక మట్టి పాత్రను బోర్లించండి... దీపారాధన వెలుగుతున్నంత సేపు ఆ బోర్లించిన మట్టి పాత్రకి మసి అంటుతుంది.... .. ఆ మసిని..అష్ట ధాతువు తో చేసిన.. బరినే... లేదా.. వెండి భరిని లో సేకరించి..కొద్దిగా నవమూలిక చూర్ణం లో ఈ మసిని కలిపి...అందులో 3 చుక్కల ఆముదం కలిపితే... సర్వ జన ఆకర్షణ అంజన తిలకం తయారు అవుతుంది... దీనిని.. శుభ్రమైన ప్రదేశం లో ఉంచి.. ప్రతి రోజు... ఉదయం పూజ అనంతరం.. కాల భైరవ స్వామిని.. స్మరిస్తూ... ఒక దానిమ్మ పుల్లతో ఈ తిలకన్నీ మీ నుదుటన... నిలువుగా బొట్టుగా ధరించండి... ఆడవారు అయితే. కళ్ళకు కాటుకగా ధరిస్తే
.. ఈ విధముగా చేయడం వలన... అన్ని వ్యవహారాలలో జయం కలుగుతుంది... వృత్తి, వ్యాపారాలలో జన ఆకర్షణ పెరిగి... అమ్మకాలలో లాభాలు వస్తాయి... ఉద్యోగం లో అధికారుల నుండి.. ఒత్తిడులు.. తగ్గుతాయి... ఆడవారు ధరించడం వలన మోహన శక్తి పెరిగి.. భార్య భర్తలు గొడవల లేకుండా సుఖంగా ఉంటారు....
గమనిక... ఈ తిలకం ను తయారు చేసే రోజున మద్య, మాంసాదులు.. ముట్టరాడు.... మీరు తయారు చేసుకున్న తిలకం ను ఎవ్వరికీ...ఇవ్వరాదు.... ఈ తిలకం ను ఎక్కువుగా తమిళ, కేరళ, కర్ణాటక... ప్రాంతం వారు.. ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు... ఫలితం చాలా శుభకరం గా ఉండును..
శుభం భూయాత్!!!!!!
మీ జీవితం లో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల
నివారణ.. పరిహారాల కొరకు మమ్మల్నీ సంప్రదించండి..
SREE VIDHATHA PEETAM
...AKAANKKSHA YEDUR
9000123129

మహాకాళి



Image may contain: 1 person

మహాకాళి "అర్థేందు మకుటాం దేవీం వందే వారిధి సంభవాం
అంతర్‌జ్వాలా స్వరూపాం తాం జగచ్చైతన్య విగ్రహాం"
ఈ స్తోత్రం ముగురమ్మలను, వారికంటే ఆతీతమైన ఆద్యాశక్తిని ప్రస్తుతిస్తున్నది. భక్తులకు దర్శనం ఇచ్చే మూర్తిమత్త్వము, ధ్యానంలో గోచరించే తత్త్వస్ఫూర్తి, యోగ దీప్తిలో కలిగే అద్భుతానుభవం.. సర్వాతీత గుణాతీతయైన పరాంబా లక్షణము... అనీ దీనిలో స్పష్టంగా వర్ణింపబడ్డాయి. దశ మహావిద్యలు ఆమె శక్తి యొక్క ఒక్కొక్క ఆవిష్కార స్థానం.
సమస్త శక్తికి ప్రతీక
మహాకాళి వీరందరిలోనూ కాళి తొలి విభూతి విశేష అవతారం. ఈ తల్లి సృష్టిలోని సర్వబలానికి ప్రతీక. ఇంతకంటే బలవతియైన శక్తి లేదు. ఈమె శత్రు భయంకరురాలు. అతి త్వరగా ప్రవర్తించటం, ఉద్విగ్న స్వభావం ఈ తల్లి లక్షణం. సృష్టిలో ఉన్న మంద లక్షణం, జడత్వం, సోమరితనం ఇవేవి ఆమెకు పడవు. తన వీరత వల్ల అసమ లక్షణాన్ని తొలగించి అంతటినీ దివ్యభావ వాస యోగ్యంగా చేస్తుంది. కాళి అనుగ్రహం అగ్నిజ్వాలవలె జీవుణ్ణి ఆవరిస్తుంది.
పరిక్రమించే శక్తే కాళిక
ఈ జగత్తులో ప్రతి కదలిక, ప్రవృత్తి, సన్నివేశాలు ఒక క్రమగతిలో సాగిపోతుంటాయి. ఈ క్రమంలో వికసించే జీవుని కర్తృత్వం నుంచి కాలం పుడుతున్నది. వర్తమానంలో ఉండే స్థితి క్రమంగా భూతకాలంలోకి జారిపోతుంది. భవిష్యత్తు వర్తమానంలోకి చొచ్చుకుని వచ్చి, మళ్ళీ గడచిన కాలంగా రూపుదిద్దుకుంటుంది. ఈ కాల ప్రవాహం కల్పాలుగా, మన్వంతరాలుగా, యుగయుగాలుగా, సంవత్సరాలుగా మాస, దిన, యామ, మూహూర్త, లిప్తలుగా ఎడతెరిపి లేకుండా సాగిపోతుంది. దీనిని ఇలా పరిక్రమించే శక్తికి కాళిక అని పేరు. ఆ తత్త్వమే పురుషుడై మహాకాలుడవుతున్నాడు. కాలానికి విచ్చిన్న ప్రవాహ లక్షణం ఉన్నది. అయితే ఈ కాలాన్ని అనుభవించే ద్రష్ట ఉన్నంతకాలం ఇది నిత్యమవుతున్నట్లుగానే భాసిస్తుంది. కాలం అనుభావకుడు లేనప్పుడు అంతర్హితమవుతుంది.
అమృతత్త్వ విద్య
కాలం అంటే మృత్యువనీ అర్థం. ఈ మృత్యు జీర్ణమైన శరీరాన్ని విడిపించి, మరొక శరీరాన్ని చేరుతున్నది. స్వర్గనరకాల అనుభవం ఉన్నది. మళ్ళీ జన్మ ద్వారా, మరొక శరీరం ధరించటం ద్వారా ఈ లోకంలోనూ, ఇతర లోకవాసం వల్ల అవిచ్చిన్నంగా తానూ-జీవుడు-అనంత యాత్ర చేస్తున్నాడు. ఆ అనంత యాత్రా క్రమంలో జీవుడు పొందే అనుస్యూతి ఒక విధంగా అమరత్వం కలిగించేదే. అయితే మృత్యువు లేకుండా దాన్ని సచేతనంగా పొంది, జాగ్రత్ స్థితిలో, స్మృతి పరంపరను కోల్పోకుండా అమృతత్త్వం పొందే విద్య కఠోపనిషత్తులో చెప్పబడింది. ఇలాంటి జీవుడుని కాలం తన పరిమితుల్లోంచి విముక్తం చేసి కాలాతీతమైన స్థితిని కలిగిస్తుంది. ఈ సాధన కోసం కాళిని ఉపాసించాలి. కాళి ఉపాసన ద్వారా ఉపాసకుడు కాలము తానై, కాలాన్ని అతిక్రమించవలసి ఉంటుంది. సర్వజీవులకు ఆనాదిగా సాగివస్తున్న భయం మృత్యువునకు సంబంధించిందే. శిథిలమై, రోగగ్రస్తమయ్యే తన జీవుడు శాశ్వతంగా భావిస్తున్నాడు. మరణం ఆసన్నమైన క్షణంలో సర్వం కోల్పోతున్నట్లు, తన తనం అంతమైపోతున్నట్లు వాపోతున్నాడు. కాళీమాత ఆ భయాన్నించి సాధకుడిని రక్షిస్తుంది.
ఆమె రూపం భయంకరం
కాళికా దేవి రూపం భయంకరమైనది.ఆమె నివాసం మహాశ్మశానం.ఆమె అక్కడ శవం మీద నిలిచి, ఆట్టహాసం చేస్తూ, నాలుక బయటకు, చాచి పుర్రెల హారాన్ని ధరించి, నాట్యమాడుతూ ఉంటుంది. ఆమె నాలుగు హస్తాలలో ఖండితమైన దైత్య శిరస్సునూ, ఖడ్గాన్ని, వరదాభయ ముద్రలనూ కలిగి ఉంటుంది. ఆమె దిగంబరి. ఏ ఆచ్చాదన లేని సనాతన క్రోధశక్తి. కాళి శబ్దం నలుపును తెలియజేస్తుంది.
భద్రకాళి...సర్వశుభంకరి
కాళి మూర్తులలో దక్షిణకాళి, భద్రకాళి అనే రెండు మూర్తులు ఉన్నాయి. దక్షిణ అంటే అంతర్బోధ వల్ల కలిగే క్రియాశీలత. భద్రశబ్దం అందరికీ మేలు కలిగించే అంశం. దక్షిణకాళి చేసే సంహార కృతం ప్రణాళికా రహితమైనది కాదు.నిరర్థకమైందీ కాదు. అది నిర్దిష్టమైన విశ్వపురోగమన శీలమైన కార్య నిర్వహణం.భవిష్య సృష్టి పురోగామి లక్షణం కలది కావాలి. భద్ర శబ్దం శుభదాయకమైంది. సర్వులకు క్షేమం కలిగించేదీ అయివుంటుంది. కాలం అనే పాకశాలలో వ్యక్తమైన జగత్తును ఆమె వండి దాన్ని రుచికరమైన పదార్థంగా పరిణమింపజేస్తుంది. అందుకే ఆమె పాచక శక్తి అవుతుంది.
యోగసాధకులకు కాళి అనుగ్రహం
"నాయమాత్మా బలహీనేన లభ్య" అని వేదం అంటున్నది. బలం సాధించాలి. బలం ద్వారా పరమాత్మను సాధించాలి. మూలాన్ని ఎరుగటం కేవలం ధీరులకే సాధ్యం. కాళీ ఉపాసన వీరసాధన. శ్మశానంలో శవం మీద కూర్చుని, సామాన్యులకు భీతిని కలిగించే అస్థి కపాలము మొదలైన వాటిని ఉపకరణాలుగా సాధన చేసే విధానము ఉన్నది. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు, భాధలు భరించాల్సి ఉంటుంది. బ్రహ్మాండంలో మహాశక్తిగా సాక్షాత్కారం పొందే శక్తి శరీరంలో మూలాధారంలో కుండలనీ శక్తిగా నిద్రాదశలో ఉంటుంది.ఈ సాధన దశలో ఆమె మేల్కొని చుట్టుకుని ఉన్న తనను చేరరాని అనంత స్థుతులు, అంతస్తులు సులభంగా సాధకులకు అందుతాయి.ఏ యోగమార్గంలో సాగేవారికైనా కాళిమాత అనుగ్రహం తప్పనిసరి.
సర్వం కాళీ రూపాలే
విశ్వకుండలినీ శక్తి కాళియే. అక్కడి ప్రాణశక్తి ఉన్మేష నిమేశాలు ఆమె రూపంలో ప్రాణ శక్తులను పరిపాలిస్తున్నది. మనలోని ఉద్రేకాలు, తలుపులతో అల్లుకునే ప్రేరణలు గాఢమైన అనుభవాలు అన్నీ కాళికాదేవి రూపాలే. మన మనస్సును, ఆస్మితను మన ఉచ్చ్వాస నిశ్వాసాలతో అనుబంధం చేసి ఈ సాధన కొనసాగించవలసి ఉంటుంది. ఈ దేవతార్చన కోసం, భావం కోసం ఉద్దిష్టమైన తత్త్వం క్రీం బీజాక్షరంలో నిక్షిప్తమై ఉన్నది.
రెండు రూపాలలో కాళి
కాళికా దేవియే ప్రధాన దేవత అనీ, అన్ని విద్యలు ఆమె నుంచి ఉద్భవించాయనేది ఒక సంప్రదాయం. ఆమె దక్షిణ వామ పార్శ్వాలలో, దక్షిణ వామ రూపాలలో ప్రకటితమయ్యింది. బృహన్నీలా తంత్రం ప్రకారం రక్త కృష్ణ భేదంతో కాళికాదేవి రెండు రూపాలలో ప్రకటితమయింది. రక్త రూపంలో ఆమె సుందరి. కృష్ణ రూపంలో దక్షిణ అని ఖ్యాతి నొందింది. దేవతలు మతంగముని Image may contain: 1 personఆశ్రమం చేరి అక్కడ మహామాయా స్తోత్రం చేసారు. అక్కడ దేవి మతంగ స్త్రీ రూపంలో దర్శనం ఇచ్చింది. ఆమె దేవతలను మీరెవరిని స్తుతిస్తున్నారు అన్నది. ఆమె అప్పుడు కాటుక వంటి నీల వర్ణంలో ఉన్నది. అందుకే కాళి అయిందని కాళికా పురాణం చెప్పింది.
అష్టవిధ కాళికలు
మహాకాళి మరికొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల వర్ణనం ఉన్నది. 1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక. ఇంకా సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి ఈమె మూర్తి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరిస్తుంది. కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి. 22 అక్షరాల మంత్రం ప్రసిద్ధిమైంది. పంచదశాక్షర మంత్రం, పంచాక్షరం, షడక్షరి సప్తాక్షరం, ఏకాక్షర మంత్రము ఇలా పలుమంత్రాలను మంత్ర రత్నాకరం పేర్కొన్నది.ఈ మంత్రాల సాధనలో నిర్దేశించిన ప్రకారం జపహోమ తర్పణాలు కుడా చెప్పబడ్డాయి.
దశ మహా విద్యలలో మొదటిది కాళి. సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక. కాలాన్ని నడిపించేది, సాధకులజి మృత్యు భయాన్ని పోగొట్టేదీ ఆమే. ఆమెఉపాసన గొప్పానుభూతి. కఠినతరమైన ఆ ఉపాసన చేయగలిగితే అనంత శుభ ఫలాలు అందుతాయి.
శిధిలాలను తొలగించి నూతన నిర్మాణాన్ని చేపట్టిన విధం మహాకాళిక తత్వంలో ప్రకటితమవుతుంది. కాళికా ఉపాసన ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో అధికంగా ఉంది. వంగ దేశం ఈ దేవతకు ప్రధాన ఆవాస స్థానం. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో కాళ్ ఉపాసన అనేక రహస్య మార్గాలలో చేసేవారు ఎందరో సాధకులు ఉన్నట్లు చెబుతారు. తమో గర్భంలో దాగివున్న వెలుగుని, మృత్యు గర్భంలో దాగి వున్న చేతనను, ఆ విద్యలో బీజ భూతంగా నిద్రాణ స్థితిలో ఉన్న జ్!నానాన్ని మేల్కొలిపే ప్రాణ రూపమైన మహా ప్రచండాగ్ని కాళికా దేవి.

Tuesday 15 October 2019

నేను రోజు పూజించే దేవుడి దగ్గర నాకు మాట్లాడే అవకాశం దొరికింది....



దేవుడా! నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగవచ్చా!
దేవుడు: అడుగు.
నేను : మీరు నేను అడిగే ప్రశ్నలకి కోపం తెచ్చుకోకుండా జవాబులు ఇస్తారా?
దేవుడు : ఇస్తాను
నేను : ఈ రోజు నాకు ఎందుకు చాల చెడ్డ రోజుని ఇచ్చావు ?
దేవుడు : ఎందుకని నువ్వు అలా చెప్తున్నావు
నేను : ఎప్పుడు సరైన సమయానికే నిద్ర లేచే నేను ఈ రోజు చాలా ఆలస్యంగా లేచాను.
దేవుడు : అవును.హడావిడిలో నాకు నమస్కారం కూడా చేయకుండా వెళ్ళావు.
నేను : నేను లేటుగా ఆఫీసుకి బయలుదేరాను దారిలో నా బండి పంచర్ అయింది.
దేవుడు : అవును ! నాకు తెలుసు .
నేను : సరే ! పోనీ బస్సులో వెళ్ళాదము అని బస్సు ఎక్కా, మధ్యలో యాక్సిడెంట్ అయింది, ట్రాఫిక్ జామ్ లో ఒక గంట ఆఫీసుకి లేట్ అయింది .
దేవుడు: అవును ! తెలుసు .
నేను: మధ్యాహ్నం భోజనానికి లేట్ అయింది ,ఈ లోపు క్యాంటీన్లో భోజనం అయిపోయింది. కొట్టుకి వెళ్లి ఎదో ఒకటి తిని వచ్చా .
దేవుడు : అవును ! అది కూడా నాకు తెలుసు .
నేను : బ్యాంకు లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను దాని విషయమై ఒక వ్యక్తి నుంచి ఫోన్ రావటం కోసం ఎదురుచూశాను. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అతని వద్ద నుంచి ఫోన్ వచ్చింది బ్యాటరీలో ఛార్జ్ అయిపోయినందువల్ల ఆ సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
దేవుడు : అవును ! తెలుసు
నేను : ఎలాగో ఓలాగా ఇంటికి చేరా ! కొద్దిసేపు AC రూంలో కూర్చొని TV చూస్తూ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా కానీ AC పని చేయలేదు .ఈ రోజు నాకు ఒక పని కూడా సరిగ్గా జరగలేదు.
ఒక రోజు నీకు దండం పెట్టకుండా వెళ్లినందుకు నాకు ఇన్ని కష్టాలా !
(దేవుడు పెద్దగా నవ్వి కొన్ని సెకన్ల తర్వాతా మాట్లాడటం మొదలు పెట్టాడు.)
దేవుడు: నీ కర్మ ప్రకారం ఈ రోజు నీకు అంతా చెడుగా జరిగింది. ఈ రోజు ప్రొద్దున నువ్వు హాయిగా నిద్రపోతున్న సమయంలో యమధర్మరాజు నీ వైపు వస్తూ ఉన్నాడు. అతనితో వాగ్వాదం చేసి నిన్ను కాపాడటానికి నిన్ను కొంచెం ఎక్కువ సేపు నిద్రలో ఉంచాను.
నేను : ఆశ్చర్యంతో ! ఓ దేవుడా !
దేవుడు: నీ బైక్ ని పంచేర్ చేశాను ఎందుకంటే నువ్వు ఆఫీసుకి వెళ్లి దారిలో బ్రేక్ ఫెయిల్ అయిపోయిన ఒక వ్యాన్ నీ వైపుగా వచ్చి నిన్ను గుద్దేలా ఉంది. ఆ వ్యాన్ యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ ఆగింది నువ్వు బైక్ లో వెళ్లి ఉంటే ఆ వ్యాన్ యముడి లెక్క ప్రకారం నిన్ను గుద్ది ఉండేది .
నేను: (మౌనంతో ) ఊ....
దేవుడు: మధ్యాహ్నం నీకు భోజనం దొరక్కపోయిన కారణం చివర్లో ఉన్న ఆహారంలో ఎలుకలకు పెట్టిన మందు భోజనంలో కలిసింది, అది ఎవ్వరు గమనించలేదు దాన్ని నువ్వు తింటే ఏం అయి ఉండేది .
నేను: ( కళ్ళలో భయంతో ) ఊ ఊ ....
దేవుడు: సాయంత్రం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన కారణం ఆ వ్యక్తి నీకు తప్పుడు సమాచారం ఇచ్చి నిన్ను ఇరికించాలి అని అనుకున్నాడు, దాని నుంచి నిన్ను కాపాడటానికి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను.
నేను: ఊ ఊ ...
దేవుడు: తర్వాత ఆ AC మెషిన్ కి ఎర్త్ రిపేర్ వచ్చి కరెంటు ఎక్కువగా పాస్ అవుతుంది, ఒక వేళా నువ్వు ఎప్పటిలాగే ముఖం కడుక్కొని తడి చేతితో స్విచ్ ఆన్ చేస్తే నీకు కరెంటు షాక్ కొట్టి ఎగిరి పడతావు అని AC పని చేయకుండా చేశాను.
నువ్వు నాకు దండం పెట్టడం మర్చిపోయినందుకే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయని నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు కానీ నువ్వు నన్ను ప్రతి రోజు పూజిస్తూనే ఉన్నావు, ఒక్క రోజు నన్ను పూజించటం మర్చిపోయినా కూడా నేను నిన్ను కాపాడటం మర్చిపోలేదు.
నేను: ఇప్పుడు అర్ధం అయింది దేవుడా ! నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమని, నేను అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకున్నాను . నన్ను క్షమించు .
దేవుడు: క్షమించు అని అడగవద్దు. నువ్వు ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా నా పై నమ్మకం ఉంచు అది చాలు.
నేను : ఖచ్చితంగా!
దేవుడు : నువ్వు నీ గురించి వేసే అంచనాలకన్నా నేను నీ గురించి వేసే అంచనాలే సరిగ్గా ఉంటాయి .
నేను: ఇంకెప్పుడు నేను నీ విషయంలో సందేహపడను స్వామి , నేను నీ శక్తిని కూడా సందేహించను. మా కనురెప్పల వాలే ప్రతిక్షణం నువ్వు మమల్ని కాపాడుతున్నావు అని తెలుసుకున్నాను.
దేవుడు: నన్ను నమ్మిన వారి చేతిని నేను ఎప్పుడు విడిచిపెట్టాను.

Saturday 12 October 2019

దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?*


*పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం , అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..*
*1. పాండవులు మాయజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలు అయ్యారని అందరికి తెలిసిందే. అరణ్యవాస చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా పాండవులను కలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు "జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు" అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు "నేను ఆ రోజు అక్కడలేను, సాల్వుడు అనే రాజుతో మాయ యుద్ధం చేస్తున్నాను (6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది!) నాకు కానీ ఆ విషయం తెలిసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను" అన్నాడు. (ఆ సర్వాంతర్యామికి జూదం సంగతి తెలియదంటారా)?.*
*అసలు ఈ పాండవులు , శ్రీకృష్ణుడు వచ్చిందే భూమి మీద దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం. కానీ పాండవులు మానవులు కావడం చేత శక్తులు కానీ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలు కానీ, ఏమీలేవు. ఉన్నది ఒక్కటే 'ధర్మం'.. అరణ్యవాసం అజ్ఞాత వాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే. కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో బ్రష్టులు అయిపోతారు. ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి. ఆలా చేయాలంటే బలం, బలగం, ఆయుధ సంపత్తి, అస్త్ర శాస్త్రాలు, దైవబలం మెండుగా ఉండాలి. కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం. అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు. తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు.* *వస్త్రాపహరణం సమయంలో ద్రౌపతి శ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి అక్కడే ఉన్న ధర్మరాజు అదంతా చూసికూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు!(ఇదే మాయ అంటే).*
*అటుపక్క భీష్ముడు లాంటి యోధుడు (21సార్లు క్షత్రియులు మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన దీరోధత్తుడు, పరశురాముడిని ఓడించిన మహావీరుడు), పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవుల పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శాస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒకప్రక్క. పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు(ఈ కవచాన్ని బెదించాలంటే మానవమాత్రుడి వల్ల కాదు! దైవబలం పుష్కలంగా ఉండాలి). కపటి శకుని, పుత్రప్రేమతో తపించిపోయే దృతరాష్ట్రుడు, అన్నకోసం దేనికైనా తెగించే దుశ్శాసనుడు వీళ్ళు ఒక పక్క.*
*ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి. వీరికి సామంతులు మహాబలవంతులు. వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు. కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా, సానబెట్టిన వజ్రంలా తయారుచేసి శత్రువుల మీదకి సాధించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అందుకే మనకి పైకి శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు అడవుల పాలయ్యారు. కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది. లోక రక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బావుంటుంది కనుక దుష్టశిక్షణ జరుగుతుంది కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది.*
*2. జూదంలో ఒడి అడవులపాలు అయ్యారు. అసలు ఇక్కడ జరిగింది వేరు. వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది. భోగాల్లో మునిగి తేలారు. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కానీ, అస్త్రశస్త్రాలు సాధిచడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు. అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పాండవుల క్షేమం కోసం ఎప్పటికప్పుడు మునులని, ఋషులని, ఎవరిని చూస్తే జన్మ చరితార్ధం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి, ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేల చేశాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు.*
*అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినట్లు వేసినట్లు మాయమవుతున్నాయి. చివరికి అమ్ములపొద కూడా మాయమయింది. అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు. విల్లు మాయమయింది. అర్జునుడు శివుడిని పిడిగుద్దులు గుద్దాడు. శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూర్చిల్లి కిందపడ్డాడు. తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది! కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు. పాశుపతాస్త్రం అందించారు. ఆవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. శివా! ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావ్? అని అడిగితె! అర్జునుడు శివుడుని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయ్యింది (ఇదొక వరం). దానికితోడు పాశుపతాస్త్రం వచ్చింది.*
*తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు. అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి (నపుంసకుడు) అవుతావు అని శాపం పొందుతాడు. ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠ కి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు. దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి నాట్యం శిక్షణ ఇస్తాడు. ఈ శాపం అజ్ఞాత వాసంలో వరంగా మారింది. నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి నాట్యశిక్షణ కోసం ఉపయోగపడింది. ధర్మరాజు జ్ఞానాన్ని, తప్పస్సుని పెంచుకుంటే, అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. భీముడు గురించి చెప్ప పనిలేదు. భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని, ఎనలేని కీర్తి గడించారు.*
*ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం!*
*ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది. ఏపని చేసినా కలిసిరావడంలేదు అని వాపోతారు. దేవుడుని నిందిస్తారు. నేను ఎం పాపం చేశాను! ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మునుపు పనికిమాలిన పనులు గుర్తుండవు. గుర్తురావు. పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు. అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరులేరు. నాబ్రతుకు ఇంతే! ఇంకేమి సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.*
*దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి. ఆ సమయంలో ఎవరులేరని భాధపడకూడదు. ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఉన్నాయి. అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరూ రారు. రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి? ఒకవేళ వస్తే సాధన చేస్తారా? చేయరు. (ఒకటి ఆలోచించండి! పాండవులు అరణ్యవాసం చేయకపోతే కురుక్షేత్రం జరిగేది కాదు. ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది. దుష్టశిక్షణ జరిగేది కాదు. మహాభారతం మనకి దొరికేది కాదు..*
*వాళ్ళుకూడా చరిత్రలో కలిసిపొయెవారె!).. అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంధ పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి. సరైన గురువు కోసం అన్వేషించాలి! అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో!*
*ఒకరకంగా చెప్పాలంటే సుఖపడుతున్నాం అంటే పుణ్యం కరిగిపోతున్నట్టు. కష్టపడుతున్నాం అంటే పాపం కరిగిపోతున్నట్టు. ఇప్పడు ఆలోచించుకోండి!*
*సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా! కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటారా! సుఖపడుతున్నప్పుడు దానధర్మాలు చేయాలి. యజ్ఞయాగాదులు (రోజుకు ఒక పేజి అయినా గ్రంధ పటనం చేస్తుంటే అదే కలియుగంలో యజ్ఞం) చేయాలి. అప్పుడు కష్టాలు మీదగ్గరికి రావు సరికదా. మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్నా అనతికాలంలోనే వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆదైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. భగవంతుడు మీప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎదో కారణం ఉంటుంది. శ్రీకృష్ణుడు తోడు ఉండి కూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు.. కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు. కృంగిపోవద్దు.

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?





No photo description available.





జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మానస సరోవరం


కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల.
తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు- ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే. హిందూ పురాణాలలోను, కావ్యాలలోను ఈ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణనలు ఉన్నా, అనుభవైక్యం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు. చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం, కైలాస పర్వతం రెండూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచి నీటి తటాకం మానస సరోవరం.
దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి. సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవర చుట్టుకొలత దాదాపు 88 కిలోమీటర్లు ఉంటుంది. లోతు దాదాపు మూడు వందల అడుగుల దాకా ఉంటుంది. బ్రహ్మ మదిలో ఈ సరోవరం పుట్టిందని.. బ్రహ్మే దీనిని భూమిపైకి తీసుకువచ్చాడని హిందూపురాణాలు చెబుతాయి. బ్రహ్మ మానసంలో(మనసు) పుట్టింది కాబట్టి దీనికి మానససరోవరం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం.
బౌద్ధ జాతక కథలలోను, ఇతర గ్రం«థాలలోను కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. ‘అనవతప్త’ అని బౌద్ధులు పిలుచుకొనే ఈ సరోవరం ఒడ్డున ‘చూ గంప బౌద ్ధఆరామం’ ఉంది. బుద్ధుడు భూమిపై ఉద్భవించటానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందనేది బౌద్ధుల నమ్మ కం. నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉందనే విషయాన్ని చెప్పటానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కొన్ని వేల ఏళ్ల నుంచి భారత ఉపఖండంలో నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
రెండు మార్గాలు..
ఒకప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించటానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉండేది. మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టేది. పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు. యాత్రకు వెళ్లాలనుకొనేవారు ముందు నేపాల్ చేరుకొనేవారు. ఖాట్మండులోని పశుపతినాథుడి ఆలయాన్ని సందర్శించుకొని.. అక్కడి నుంచి కాలినడకన మానస సరోవరానికి బయలుదేరేవారు. వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో పెరిగే గడ్డిని తినటానికి ముందుగా వాటిని వదిలేవారు. ఆ పశువులు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ వాటి వెనకే వెళ్లేవారు. ఎముకలు గడ్డకట్టే చలిలో ఆహారం దొరకక, ఆక్సిజన్ సరిగ్గా అందక మరణించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.
అందుకే ఒకప్పుడు మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చిన వారిని ప్రజలు మృత్యుంజయులుగా చూసేవారు. వారిని అమితంగా గౌరవించేవారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత కూడా టిబెట్‌లోను, అక్కడి మౌలిక సదుపాయాల విషయంలోను ఎటువంటి మార్పు రాలేదు కాని భారత్, చైనాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. దీనితో 1954లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించటానికి భారత యాత్రికులకు అనుమతి ఇవ్వటం మానేసింది. ఆ సమయంలో కూడా కొందరు నేపాల్ చేరుకొని అక్కడి నుంచి రహస్యంగా కైలాస పర్వతాన్ని సందర్శించటానికి వెళ్లేవారు. అదెలాగున్నా 24 ఏళ్ల తర్వాత- 1978లో చైనా సర్కారు మళ్లీ భారత యాత్రికులను ఈ ప్రాంతానికి అనుమతించటం ప్రారంభించింది.
ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మందిని మాత్రమే అనుమతించేవారు. అతి తక్కువ మందిని అనుమతించటం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా తయారయింది. 1990ల తర్వాత టిబెట్ పట్ల చైనా ప్రభుత్వ వైఖరి మరింత కఠినమయింది. ఇదే సమయంలో- ఈ ప్రాంతంలోకి యాత్రికులను అనుమతించటం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చైనా గుర్తించింది. దీనితో 1995 తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పథకాలు సిద్ధం చేయటం మొదలుపెట్టింది. ఒకప్పుడు కేవలం పర్వత మార్గం ద్వారానే యాత్రికులకు అందుబాటులో ఉండే కైలాస పర్వతం దగ్గరకు హెలికాప్టర్ సర్వీసు కూడా ప్రారంభమయింది. దీనితో కైలాస పర్వతం సందర్శించటానికి రెండు మార్గాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. ఏ నిమిషంలో వాన పడుతుందో.. ఏ నిమిషంలో ఎండ వస్తుందో కనుగొనటం చాలా కష్టం. అంతే కాకుండా కొన్ని సార్లు పర్వతాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. కొన్ని రోజుల పాటు సూర్యకాంతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్‌లలో ప్రయాణం చాలా ప్రమాదం. పైగా ఖర్చు ఎక్కువ. దీనితో ఎక్కువ మంది యాత్రికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల క్రితం టిబెట్‌లోని కొందరు బౌద్ధ బిక్షువులు చైనా ప్రభుత్వంపై తిరగబడడంతో దాన్ని వెంటనే అణచి వేసినప్పటికీ చైనా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సైన్యం టిబెట్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా చేరుకోవటానికి వీలుగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే మానస సరోవరం, కైలాస పర్వతానికి రోడ్ల నిర్మాణం ప్రారంభించింది.
70 శాతం పూర్తి..
మానస సరోవరానికి, కైలాస పర్వతానికి చేరుకోవటానికి రోడ్డు ద్వారానే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది- నేపాల్ నుంచి టిబెట్‌లోకి ప్రవేశించి జాంగ్ము, సాగాల మీదుగా మానససరోవరం చేరుకోవటం. ఖాట్మండు నుంచి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్‌కు చేరుకోవటానికి కనీసం ఆరు గంటలు పడుతుంది. వేల అడుగుల లోతైన లోయల పక్క నుంచి.. హఠాత్తుగా విరిగి పడే కొండచరియలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటిన తర్వాత జాంగ్మూకు చేరుకోవటానికి ఒకప్పుడు 12-14 గంటలు పట్టేది. ఒకప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గని తారురోడ్లు వచ్చేసాయి.
అందువల్ల ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్లిపోగలుగుతున్నారు. అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా వచ్చింది. జాంగ్మూ నుంచి సాగాకు, సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు, ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. సాగా నుంచి మానస సరోవరానికి గత ఏడాది 30 శాతం మాత్రమే తారు రోడ్డు ఉంటే.. ఈ సారి అది 70 శాతానికి పెరిగింది. దీని వల్ల పన్నెండు నుంచి పదహారు గంటలు పట్టే ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం ప్రారంభమయింది.
వచ్చే ఏడాది మానస సరోవర యాత్ర ప్రారంభమయ్యే నాటికి సాగా నుంచి మానస సరోవరానికి ఆరు గంటల్లో వెళ్లిపోవచ్చంటే అతిశయోక్తి కాదు. మానస సరోవరం నుంచి కైలాస పర్వతం బేస్‌క్యాంపు దాకా కూడా చైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాది బేస్‌క్యాంపు నుంచి కైలాస పర్వతం కింది దాకా జీపులపై వెళ్లటానికి కూడా కొందరికి అనుమతులు ఇచ్చింది. ఇదే ఒరవడి ఇంతే జోరుగా కొనసాగితే- కైలాస పర్వతానికి నేరుగా జీపుల్లో వెళ్లే అవకాశం ఏర్పడవచ్చు. అంటే వచ్చే రెండు,మూడేళ్లలో- మానస సరోవర యాత్ర- చాలా మందికి ఒక పిక్నిక్‌గా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదనంగా ఐదు వేల యువాన్‌లు- అంటే 40 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఉక్కు కవచం..
ఒక పక్క వేల మంది యాత్రికులు సునాయాసంగా కైలాస్ మానససరోవర యాత్రకు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం.. మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటడానికి (అంటే టిబెట్‌లో ప్రవేశించటానికి) ఎంత సమయం పడుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కొందరు యాత్రికులకు రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా దలైలామా గురించి కాని.. టిబెట్ స్వాతంత్య్ర పోరాటం గురించిగాని పుస్తకాలు పట్టుకెళితే – వారికి టిబెట్‌లో ప్రవేశం ఉండదు.
జాంగ్ము, సాగా వంటి పట్టణాలలో ఫోటోలు తీయటాన్ని కూడా చైనా సైన్యం నిషేధించింది. సాగాలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన స్థలమని హిందువుల, బౌద్ధుల ఇద్దరి విశ్వాసమూ. అందువల్ల చాలామంది ఈ నదీ తీరాన ప్రార్థనలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉం టారు. అయితే ఈ నదీతీరానే చైనా సైనిక శిబిరం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ ప్రార్థనలు చేయటాన్ని.. ఫోటోలు తీయటాన్ని ఈ ఏడాది కొత్తగా నిషేధించారు. ఇక మానససరోవర ప్రాంతంలోని గుడారాలలో నివసించే వారిని చైనా సైన్యం అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి తీర్థయాత్రలోని ఆనందాన్ని మనకు తగ్గించేస్తున్నాయని చైనావాళ్లు గుర్తిస్తున్నట్టు లేరు.
ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం
కైలాసపర్వతాన్ని టిబెటన్ భాషలో రిన్‌పోచి అని పిలుస్తారు. ప్రతి ఏడాది వేల మంది హిందూ భక్తులు కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. టిబెటన్లు కూడా ఈ పర్వతాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వతంపై పాదం మోపటం పాపంగా భావిస్తారు. అందువల్ల వీరు మోకాళ్లపై కైలాస పర్వతాన్ని ఎక్కుతారు. హిందువులు ఎక్కువగా కైలాస పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు కాని పర్వతాన్ని అధిరోహించరు. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి గతంలో ప్రయత్నించారు. అయితే ఏదో ఒక కారణం వల్ల ఈ ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. 1926లో హ్యుగ్ రటిల్ఎడ్జ్ అనే బ్రిటిష్ సాహసికుడు చేసిన ప్రయత్నం చరిత్రలో నమోదు అయిన తొలి ప్రయత్నం. 1936లో హ్యుబర్ట్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ప్రయత్నించాడు.
అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రిన్‌హోల్డ్ మెస్‌నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్‌నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్‌కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని.. అందువల్ల దానిని అధిరోహించటానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.
అతి పవిత్రం మానస సరోవరం..
* బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు.
* సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణమి నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.
* భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.
* మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.
* చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ ఒక హోటల్‌ను కూడా నిర్మిస్తోంది. ఇటువంటి నిర్మాణాల వల్ల మానస సరోవర పవిత్రత దెబ్బతింటుందని.. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతమంతా శక్తిమయం....
సైన్స్ ప్రకారం- కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి (ఎనర్జీ) ఉంటుంది. దానిని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం అలాంటి ప్రాంతాలు. నేను ఈ ప్రాంతానికి గత ఏడేళ్లుగా వస్తున్నాను. వచ్చిన ప్రతి సారి ఒకో విధమైన అనుభూతి ఏర్పడుతూ ఉంటుంది. దానిని నేను మాటల్లో వర్ణించలేను. మానస సరోవరంలో రాత్రి వేళ అనేక కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు కనిపించే శక్తిరూపాలు. ఇక కైలాస పర్వతం గురించి చెప్పాలంటే ఆదిముని- ఈశ్వరుడు మానవ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించటానికి మొదట ఈ ప్రాంతానికే వచ్చాడు. మూడు నాలుగు నెలల పాటు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. ఈశ్వరుడిని చూడటానికి పెద్ద గుంపు తయారయింది. ధ్యానంలో ఉన్న యోగి ఏవో అద్భుతాలు చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.
రోజులు గడుస్తున్నాయి. ఎటువంటి అద్భుతాలు జరగటం లేదు. గుంపు పలచబడింది. ఏడుగురు మాత్రం మిగిలారు. ఈశ్వరుడు కళ్లు విప్పాడు. ఆ ఏడుగురు తమకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించారు. తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. ఈశ్వరుడు అప్పుడు ప్రసాదించిన విజ్ఞానం- ఈ పర్వత సానువుల్లో ఉంది. ఈ విజ్ఞానం శక్తి రూపంలో ఉంటుంది. ఒక ఇల్లు కట్టినప్పుడు దానిని నిలబెట్టడానికి కొన్ని కర్రలు అవసరమవుతాయి. ఈ పర్వత శ్రేణులు కూడా అలాంటివే. అమూల్యమైన విజ్ఞాన భాండాగారాన్ని తమలో దాచుకున్నాయి. ఈ విజ్ఞానాన్ని అందుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. నిబద్ధత అనివార్యం. ఈ రెండు ఉన్నవారు మాత్రమే ఈ ప్రాంతానికి రాగలుగుతారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి ‘నేను’ అనే అహం చచ్చిపోతుంది. అహం చనిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే నిష్ఠగా, ఏకాగ్రతతో ఈ ప్రాంతానికి వచ్చినవారికి అనేకమైన అలౌకిక, ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి.

శ్రీలక్ష్మీ ఫలం /sree phal


contact for details : 9000123129
మనస్సే అన్నింటికీ కారణం. ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుని కళలతో మనస్సు ప్రభావితం అవుతుందని పెద్దలు చెబుతారు. రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి చంద్రుడు కారకుడు. చంద్రుని ఆధారంగా ఆ నక్షత్రం యొక్క ప్రభావంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనావేస్తాం. అంటే...మనస్సు, తెలివితేటలు, గ్రహణశక్తి, మతిమరుపు, చిత్తచాంచల్యం, ఇంద్రియనిగ్రహం, సౌందర్యం, లావణ్యం, శరీరసౌఖ్యం... మొదలైనవి.సూర్యచంద్రకాంతుల ప్రభావం మనపై ఉంటుంది. సూర్యకాంతి వల్ల శారీరక ఆరోగ్యం, చంద్రకాంతి వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతాయని గుర్తించాలి. అందుకే ఇంటిలోకిసూర్య, చంద్రకాంతి పడేలా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి.
జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు ,బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి.శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు దొరుకుతాయి.
శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి.శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి.
శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి.కొబ్బరికాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరికాయలకు ఉండే విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.
శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పసుపు,గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్ట్లు పెట్టాలి.శ్రీఫలమ్ చుట్టు పుష్పాలతో అలంకరించాలి.లవంగాలు,యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపాలి.తరువాత పసుపు గాని,ఎరుపు గాని,తెలుపు గాని వస్త్రాన్నితీసుకొని శ్రీలక్ష్మీ ఫలాన్ని ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి.శ్రీలక్ష్మీ ఫలంతో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే.
"ఓం శ్రీం శ్రియై నమః"అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేయాలి.
జాతకంలో చంద్రుడు పాపస్థానాలలో ఉన్న నీచలో ఉండి శుభగ్రహ దృష్టి లేకపోయిన మానసిక సమస్యలు ఎదుర్కొంటారు.అమావాస్య పౌర్ణమి రోజులలో ఉద్రేకాలకు లోనవుతారు.ఇలాంటి వారు ఎల్లప్పుడు శ్రీఫలాన్ని దగ్గర ఉంచుకుంటె మంచిది.శ్రీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్ట దోషం అంటారు.బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీపలాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మెడలో గాని ,నడుముకి గాని కట్టుకోవాలి.
ప్రజాపయోగ వ్యాపారసంస్థలలో,వాటర్,రియల్ ఎస్టేట్,పాల వ్యాపారసంస్థలలో తప్పనిసరిగా శ్రీపలాన్ని పూజించాలి.శ్రీ ఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.శ్రీ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచిన సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.శ్రీ ఫలాన్ని పూజచేసుకొని దగ్గర ఉంచుకొనేవారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు.శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడు నాణేలను ఉంచాలి.
శ్రీ ఫలాన్ని వ్యవసాయం చేసే వారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి.వాయువ్య దిక్కు దోషం ఉన్నవారు 11 శ్రీపలాల్ని తెల్లగుడ్డలో చుట్టి వాయువ్య దిక్కున ఉంచిన దోష నివారణ జరుగుతుంది.
పిట్స్,మతిమరుపు,స్త్రీలకు ఋతు సమస్యలు,గర్బాశయ సమస్యలు ఉన్న వారు శ్రీపలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవాలి.