Thursday 26 July 2018

జులై 27న సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్ర గ్రహణం



ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్ర గ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. జులై 27 రాత్రి నుంచి జులై 28 వేకువజాము వరకు ఈ గ్రహణం కొనసాగనుంది. ఈ చంద్ర గ్రహణాన్ని భారత్‌లోనూ వీక్షించే వీలుంది. ఆ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో కనువిందు చేయనున్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 44 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది. 


స్వస్తిశ్రీ విలంబి నామ సంవత్సరం ఆషాఢమాసం పూర్ణిమ రోజు 27 జూలై 2018 శుక్రవారంరోజు మకరరాశిలో ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలలో కేతుగ్రస్తంగా మేష,వృషభ,మిధున లగ్నాలలో చంద్రునికి తూర్పుభాగంలో గ్రహణం స్పర్శించి పిదప సంపూర్ణంగా చంద్ర గ్రహణం మనకు కనిపిస్తుంది.
ఈ గ్రహణం భారతదేశంతో పాటు దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండములలో కనపడును.


భారతదేశ కాలమాన ప్రకారం సంపూర్ణ చంద్ర గ్రహణ సమయములు

చంద్ర గ్రహణ స్పర్శ : రాత్రి 11 గంటలు 54 నిమిషాలు
సంపూర్ణ స్థితికి గ్రహణం రాక : రాత్రి 01గంటలు 00 నిమిషాలు
చంద్ర గ్రహణ మధ్యకాలం : రాత్రి 01గంటలు 52 నిమిషాలు
సంపూర్ణ స్థితి నుండి విడుపు ప్రారంభం : రాత్రి 02 గంటలు 43 నిమిషాలు
చంద్ర గ్రహణ ముగింపు (మోక్షకాలం) : రాత్రి 03 గంటలు 49 నిమిషాలు
అద్యంత పుణ్యకాలం : 3 గంటల 55 నిమిషాలు ( మొత్తం 235 నిమిషాలు )

ఈ గ్రహణం భారత కాలమానానికి చూస్తే నిద్రించే సమయంలో ఉన్నది కనుక ఎక్కువ శాతం నిద్రలో ఉంటారు కాబట్టి చూడడానికి ఆసక్తి చూపరు.


ఈ చంద్ర గ్రహణానికి మరో విశిష్టత ఉంది. ఆ రోజు అంగారక గ్రహం భూమికి అత్యంత చేరువగా రానుంది. 2003 తర్వాత ఇంత దగ్గరగా వస్తుండటం ఇదే తొలిసారి. గ‌తంలో సుదీర్ఘ‌మైన చంద్ర గ్ర‌హ‌ణం 1700 సంవ‌త్స‌రాల కింద‌ట వ‌చ్చింద‌ట‌. ఇప్పుడు మ‌ళ్లీ ఈ ఏడాదే ఎక్కువ స‌మ‌యం పాటు చంద్ర గ్ర‌హ‌ణం కొన‌సాగ‌నుంది. గ్రహణం రోజున అంగారకుణ్ని వీక్షించే వీలుంది. చంద్ర గ్రహణాన్ని నేరుగా చూసినా ఇబ్బందేం ఉండదు.  

ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు.లేని పోని అనుమానలు పడవద్దు,అను మానాలు చెప్పే వారి మాటలను నమ్మవద్ధు.గర్భవతులు ఎవరైన రాత్రి గ్రహణ సమయానికి మేలుకుని ఉంటే ప్రత్యక్షంగా చూడ కూడదు,కాని టివిలలో చూడవచ్చు.
 
మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు అనే అపోహలకు బయపడకండి.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రహణ సమయంలో కాలక్రుత్యాలు చేసుకోవచ్చును. గ్రహణ సమయానికి కనీసం 3 మూడు గంటల ముందుగా ప్రతి ఒక్కరు ఆహారం స్వీకరించినచో,గ్రహణ ప్రారంభ సమయానికి తిన్న ఆహారం జీర్ణమగును. గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును. గ్రహణం మరసటి రోజు అనగా శనివారం నాడు ఇల్లు శుభ్రంగా తుడుచుకుని.స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంజ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోశ నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి,ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,చాదస్తాలకు పోయి ఇబ్బంది పడకూడదు. ఇంట్లో పూజ అయిన తర్వాతనే గుడికి,దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.మకరరాశి వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి.ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం,తోటకూర,బెల్లం కలిపి ఆవునకు తినిపించాలి.గోమాత మనం పెట్టిన దాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.ఈ విషయాలను శాస్త్రంపై నమ్మకం ఉన్నవారు ఆచరించండి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది. కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.రోజు అగర్బత్తి,దూపం మొదలగునవి తప్పక చూపించాలి.అందరు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు దర్భ కంకణాన్ని కట్టుకోవడం ఉత్తమం.
 
 తిరుపతి వెంకన్న స్వామి ఆలయం జూలై 28 న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది. జూలై 27 తేదీ రోజు ఆర్జితసేవలు రద్దు చేయబడినవి.సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను,పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

ఇది ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో వస్తోన్న కేతుగ్రస్త చంద్ర గ్రహణం. గ్రహణం ముగిశాక స్నానం చేసి పూజాధికాలు, దానధర్మాలు చేయడం అందరికీ శుభం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మేష రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం, శ్రవణ, ధనిష్ఠ 1,2 పాదాలు, మకర రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని వీక్షించకపోవడం ఉత్తమం. 41 రోజుల్లోపు గ్రహణ జపం, శాంతి హోమం, దానం చేయించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.  

మిథున, తుల, కుంభ రాశుల వారు ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం వీడిన 11 రోజుల్లోగా నవగ్రహ పూజ, శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలకు చెందిన గ్రహణానికి నాలుగు గంటల ముందే భోజనం చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించాలి. దీపారాధన చేసి భగవంతుణ్ని స్మరించాలి.

మేషం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ధనయోగం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించాలి. 


సుదీర్ఘ చంద్ర గ్రహణం.. ఈ ప్రాంతాల్లో స్పష్టంగా చూడొచ్చు!

మీరు కూడా ఆ అరుదైన సుదీర్ఘ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు. ఇండియాలో జులై 27 (శుక్రవారం) రాత్రి సరిగ్గా 11.44 గంటలకు నుంచి చంద్ర గ్రహణం మొదలవుతుంది. సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే.


అర్ధరాత్రి 1.51 గంటలకు ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం.. 2.43 గంటల వరకు కొనసాగుతుంది. అయితే, ఇండియాలో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు వీలున్నా.. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘాల వల్ల ఆ అవకాశం దక్కకపోవచ్చు. ఢిల్లీ, పుణె, బెంగళూరు, ముంబయిలలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది.

మళ్లీ ఇలాంటి సుదీర్ఘ చంద్ర గ్రహణం 2123, జూన్ 9న ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పడే గ్రహణాన్ని అస్సలు మిస్ కావద్దు. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 

చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఏ రాశి వారిపై ఎలా? ఏం దానం చేస్తే ప్రయోజనకరం?

 

ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్ర గ్రహణం శుక్రవారం రాబోతోంది. 103 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగనుంది. జనవరి 31న చంద్ర గ్రహణం రాగా.. ఈ ఏడాది ఇది రెండోది. గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో మరింత పెద్దగా కనిపించనున్నాడు. ఈ కేతుగ్రస్త చంద్ర గ్రహణ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉండనుంది? రాశులను బట్టి ఎలాంటి దానాలు చేయాలి? ఏయో జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 

మేష రాశి:
చంద్ర గ్రహణం ప్రభావం మేషరాశిపై సానుకూలంగా ఉండనుంది. సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కాలం గడిచే కొద్దీ శుభ ఘడియలు రానున్నాయి. ఈ రాశివారు స్వీట్లు, ఎరుపు పుష్పాలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఫలితంగా దోషాలు తొలగిపోయి, ప్రేమ బంధం మెరుగవుతుంది. పెళ్లిలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి.


వృషభం:
అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని అనిపిస్తే.. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలపండి. ఈ రాశివారు బియ్యం, పంచదార, పాలు, తెల్లటి పుష్పాలు దానం చేయాలి. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుబంధాలు బలపడతాయి.
  

మిథునం:
ఈ గ్రహణం మిథున రాశి వారికి అనుకూలం కాదు. దీంతో ఈ రాశి వారు వ్యక్తిగత సమస్యలతో సమతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త వహించాలి. ఆకుపచ్చటి వస్త్రం, కూరగాయలు, ధాన్యాలు, చందనం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణిస్తారు.

కర్కాటకం:
ఈ చంద్ర గ్రహణం మీ జీవితంలో ప్రధాన మార్పులు తీసుకొస్తుంది. మీ జీవితంలోని ప్రతి అంశం మార్పునకు లోనవుతుంది. ఈ రాశివారు బియ్యం, వెండి పాత్రలు, పాల ఉత్పత్తులు దానం చేయాలి. దీని వల్ల వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విదేశీ పర్యటనలకు ఆస్కారం ఉంటుంది.

సింహం:
ఈ రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎర్రటి వస్త్రాలు, సింధూరం, కొవ్వొత్తులు దానం చేయాలి. పేరు ప్రతిష్టలు, గుర్తింపు లభిస్తాయి.

కన్య:
గ్రహణం దశలో ప్రధాన రహస్యాలను ఎవరికీ చెప్పకుండా మీలోనే ఉంచుకోండి. ఇతరులకు చెబితే కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు. కూరగాయలు, పుస్తకాలు, రాగి, పువ్వులు, పెసర్లు, ఆహార ధాన్యాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పనిలో విజయం, ఉన్నత చదువుల్లో సత్ఫలితాలు లభిస్తాయి.

తుల:
తులా రాశిలో జన్మించిన వారు గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలి. బియ్యం, పంచదార, గంధపు చెక్క దానం చేయాలి. ఫలితంగా ప్రేమ బంధం బలపడుతుంది, వివాదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి.

వృశ్చిక:
ఈ గ్రహణం వల్ల మీరో శుభవార్త వింటారు. మీ టైం బాగుంటుంది. స్వీట్లు, ఎరుపు పుష్పాలు, ఊలు వస్త్రాలు దానం చేయాలి. జాతక దోషాలు తొలగి, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు క్రమశిక్షణ అలవడుతుంది.

ధనుస్సు:
మీ వృత్తిగత ఆకాంక్షలు, జనాల్లో గుర్తింపు నెరవరుతాయి. రొమాన్స్, సంపద పరంగా అనుకూలంగా ఉంటుంది. శనగ పప్పు, పసుపు, వంట సామాగ్రి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కెరీర్లో ప్రమోషన్, కాంపిటీటివ్ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి.

మకరం:
మెంటల్ టెన్షన్ పెరుగుతుంది. ధనం నష్టపోయే అవకాశాలున్నాయి. నూనె, నల్లటి వస్త్రాలు, ఐరన్, మినుములు దానం చేయాలి. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. విజయాలు, ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది.

కుంభం:
ఈ రాశి వారు పైకి కనిపించని శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆహార ధాన్యాలు, పువ్వులు, బియ్యం, పప్పు, దుప్పట్లు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కోర్టు కేసుల్లో, శత్రువులపై విజయం సిద్ధిస్తుంది.

మీనం:
ఈ రాశి వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి తొలగిపోతుంది. ధనం కలిసి వచ్చే అవకాశాలున్నాయి. పసుపు రంగు పూలు, పసుపు, వస్త్రాలు, టవల్ దానం చేయాలి. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి, మెరుగైన ర్యాంక్ రావడానికి తోడ్పడుతుంది.



ప్రత్యక్షంగా శివాభిషేకం, నవగ్రహపూజచేసుకోలేనివారు తమతమ పేర్లమీద ఆయా పూజలు చేయించుకోడానికి శ్రీ విధాత పీటం , ph.- 9000123129 లో  సంప్రదించగలరు. పూజలో ఉంచిన దర్భ కంకణం కూడా పొందగలరు.

శుభం
శ్రీ విధాత పీటం
9000123129






















 


 

Monday 23 July 2018

తొలి ఏకాదశి విశిష్టత..



ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు..
నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
తొలి ఏకాదశి విష్టత నియమాలు....!!

 ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు.

 తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి.
దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.

 ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 

 అసత్య మాడరాదు. 

 కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 

 ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 

 మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.

 అన్నదానం చేయడం చాలా మంచిది.


తొలి ఏకాదశి రోజున ఈ ఆహారం తీసుకోరాదు!






 ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి...శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొవడమే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష చేస్తారు. తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరు ఏకాదశి అంటారు. రుక్మాంగదుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి, పొందుకోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ క్రోధాదులను విసర్జిస్తారు. 


నిజానికి పంభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్షతోపాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు. 

ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు. 

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని వేడుకుంటారు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు

మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు, బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ఉపవాస దీక్ష చేయడానికి ఇదీ ఓ కారణమే.

Wednesday 18 July 2018

ఆషాడంలో పెళ్ళిళ్లు చేయరెందుకనీ?



పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసంగా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఆషాడ మాసం ఆరంభం అవుతుందంటేనే... అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. ఆషాడమాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు హిందువులు. అవసరమైతే.. పెళ్లిని.. మూడు నెలలు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ.. ఆషాడ మాసంలో మాత్రం పెళ్లి భజంత్రీలు మోగించరు. అలాగే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ సంప్రదాయాల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదా ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు చేస్తే ఏమవుతుంది ? ఆషాడ మాసంలో అనేక పూజలు, వ్రతాలు నిర్వహించడానికి మంచిదైనప్పుడు, పెళ్లిళ్లు చేయడానికి ఎందుకు మంచిది కాదు ? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి ?
ఆషాడ మాసం:
 ఆషాడ మాసంను ఆషాడ మంత్, ఆది మాసం అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు.

దేవతారాధన:
 ఆషాడ అనేది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. 


ఎప్పుడు ? :
ఆషాడ మాసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జూన్, జూలై మధ్యలో వస్తుంది.

శుభకార్యాలు :
ఆషాడ మాసంలో పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశం, శంకు స్థాపన వంటి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదు. కనీసం శుభకార్యాలను, మంచి పనులు ప్రారంభించరు.

పూజలకు :
మరో విచిత్రమేమిటంటే.. ఆషాడ మాసం శుభకార్యాలకు మంచిది కాదు. కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.

పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం :
అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై బిజీగా ఉంటారు. దీనివల్ల వాళ్లకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే.. ఆషాడ మాసంలో వివాహాలు నిర్వహించరు
మరో కారణం :
ఉత్తరాయణ, దక్షిణాయణ కథల ప్రకారం ఆషాడ మాసం సమయంలో.. దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల.. పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో.. ఇలా ఆషాడంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెబుతారు.

డబ్బు:
 అలాగే సౌత్ ఇండియాలో ఆషాడ మాసం అంటే.. ఎలాంటి పంట చేతిలో ఉండదు. పెళ్లి చేయడానికి అవసరమయ్యే డబ్బులు ఉండక ఇలా సంప్రదాయం పేరుతో ఆషాడంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని పండితులు చెబుతున్నారు.

వాతావరణం:
 పూర్వకాలంలో పెళ్లి అంటే.. ఎక్కువ ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పరదాలు కట్టి నిర్వహించేవాళ్లు. ఆషాడ మాసంలో గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. గాలి తీవ్రతకు పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే పెళ్లి వంటకాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. విద్యుత్ వైర్లు కట్ అవడం, హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల వల్ల.. ఆషాడంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించకపోవడం మంచిదని పెద్దవాళ్లు ఈ నిర్ణయానికొచ్చారు. అత్తా, కోడళ్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఆషాడమాసం వచ్చిందంటే.. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పెళ్లికూతుళ్లను పుట్టింటికి పంపిస్తారు. కోడలు పుట్టింటికి ఎందుకు ? కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించని మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు. ప్రసవానికి ఇబ్బంది ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం హాస్పిటల్స్ లో మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి.. ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట. గోరింటాకు ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాడం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమెట్ లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట 

అత్తా, కోడళ్లు:
 ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఆషాడమాసం వచ్చిందంటే.. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పెళ్లికూతుళ్లను పుట్టింటికి పంపిస్తారు.

కోడలు పుట్టింటికి ఎందుకు ? :
కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించని మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు. ప్రసవానికి ఇబ్బంది ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం హాస్పిటల్స్ లో మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి.. ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట. గోరింటాకు ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాడం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమెట్ లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట


ప్రసవానికి ఇబ్బంది:
 ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం హాస్పిటల్స్ లో మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి.. ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట.


కోడలు పుట్టింటికి ఎందుకు ? :
కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించని మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.


గోరింటాకు:
 ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాడం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమెట్ లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట