Friday 29 July 2016

మతము (part 2)

మతము (part 2)
continuation

హిందూమతము
హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది.హిందూ అనే పదమును ఫార్సీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి ఫార్సీ భాషలో సింధు అని అర్థము,సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలచేవారు కాని ఇప్పుడు వేదాలు మరియు వాటికి సంభందించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు.హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంభంధించినవి. ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది.. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు. ఇస్లాం, మరియు క్రైస్తవం, తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు.ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్ మరియు టుబాగో, అమెరికా, రష్యా మరియు చైనా ముఖ్యమైనవి.
హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.

పద వ్యుత్పత్తి
"హిందూ అంటే "హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః"" ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో దానిని ఖండించేవాడే హిందువు . ఋగ్వేదం సిందు నది పరివహక ప్రాంతాన్ని సప్త సింధు (ఏడు నదులు కల ప్రాంతం)అని పేర్కొంది. జొరాస్ట్రియనుల గ్రంథాలలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ఈ పదం భారత దేశ ఉపఖండంలో (సింధు నది ఆవల) నివసించే వారిని గురించి చెప్పబడింది.
మరొక సిద్ధాంతం ప్రకారం హిందువులంటే హిందుస్థానం' వాసులు. బృహస్పతి ఆగమం లో ఈ క్రింది విధంగా చెప్పబడింది
హిమాలయాత్ సమారభ్య యావత్ ఇందు సరోవరమ్, తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే.
(హిమాలయాల నుండి ఇందు సరోవరం వరకు వ్యాపించియున్నట్టి, దేవుడిచే నిర్మించబడిన దేశానికే హిందుస్థానం అని పేరు)

విశ్వాసాలు
హిందూమతంలో ఓంకారం శబ్దానికి చాలా విశిష్టత ఉంది. ఈ శబ్దాన్ని ప్రణవ నాదమని, సృష్టికి పూర్వం అంతటా ప్రణవమే ఉండేదని, ఇదే పర బ్రహ్మ స్వరూపమని అంటారు. దాదాపు అన్ని మంత్రాలకు ముందు ఓంకారం ఉంటుంది.
హిందూ మతం చాలా వైవిధ్యమైనది. కొన్ని విశ్వాసాలు ప్రబలంగా ఉన్నప్పటికీ, పండితులు అందరి చేత ఆమోదించబడే విశ్వాసాలను క్రోడీకరించడం కష్టంగా భావిస్తున్నారు.. ధర్మం (నీతి నియమాలు, విధులు), సంసారం, మోక్షం (సంసారం నుండి విముక్తి), మరియు ఇతర యోగ పద్దతులు మొదలైనవి ప్రబలమైనవి.

దైవ భావన
హిందూ మతంలో 'ఒకే దేవుడు', 'చాలా మంది దేవుళ్ళు', 'వివిధ స్థాయి దేవుళ్ళు', 'నిరాకార భగవంతుడు', 'సాకార భగవంతుడు' - ఇలా చాలా విధాలైన విశ్వాసాలు కలగలిపి ఉన్నాయి. కనుక హిందూమతం అంతటా సాధికారంగా ఒప్పుకొనే భావన ఇది అని చెప్పడం క్లిష్టతరమైన విషయమే
ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి - ఆత్మ శాశ్వతమైనది, నిరాకారమైనది. అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము (పరమాత్మ). అద్వితీయము. గుణ రహితము.ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానము లభించినవారికి మోక్షం (బంధనాలనుండి విముక్తి)సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

ద్వైతం, భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ, పరమాత్మ వేరు వేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి. అందరికీ ప్రభువైనందున భగవంతుడు "పరమేశ్వరుడు"), Bhagavan ("The Auspicious One"), or Parameshwara ("The Supreme Lord"]). కాని ఆయా వేదాంత సూత్రాలను బట్టీ, వాటి వివరణను బట్టీ "బ్రహ్మ", "బ్రహ్మము", "ఈశ్వరుడు", "దేవుడు" వంటి పదాలను అర్ధం చేసుకొనే విధానంలో వైవిధ్యం ఉంటుంది.] సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
హైందవ మతం ఏకేశ్వరోపాసన, నాస్తిక వాదం, ఆస్తిక వాదం, ద్వైతం, అద్వైతం, లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంతటి సంక్లిష్ట మైన భావాలు బహుశా మరే మతంలోనూ కనిపించవు. ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది.

హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైనటువంటి బ్రహ్మం నకు చెందినదే. బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం. అందుకనే దీనిని అద్వైతం(ద్వైతం కానిది)అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మ స్వరూపులని, బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం. ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని, సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురో వారు మోక్ష ప్రాప్తినొందగలరు.
అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం. ద్వైతం అనగా నీవు, భగవంతుడు వేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మ స్వరూపులు మనుషులౌతారు. ఈ మర్గాన పయనించేవారు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, లేదా శక్తి ని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. ఆత్మ భగవంతునిమీద ఆధారపడితే, మోక్షం దేవుని కృపమీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినపుడు ఆయనను ఈశ్వరుడు, లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు మరియు అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు. నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు.


దేవుళ్ళు, అవతారాలు
రాధాకృష్ణులు, హిందూమతంలో పూజింపబడే అనేక దేవతలలో ఒక జంట
హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అనగా స్వర్గ లోక నివాసులు, పరమ పవిత్రులు, పూజింపదగిన వారు. హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం. ధర్మాన్ని పరిరక్షించడానికి మరియు సకల మానవాళిని సరియైన దారిలోకి మళ్ళించడానికి స్వర్గం నుంచి మానవ రూపంలో భువి పైన జన్మించిన వారిని అవతార పురుషులు లేదా అవతార మూర్తులు అంటారు. రామావతారం, కృష్ణావతారం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి.

కర్మ, సంసారం, మోక్షం
కర్మ అంటే సామాన్యార్థము లో చేతలు, పని చెయ్యడము, విధి మరియు కార్యకారణ నియమము అని చెప్తారు. ఉపనిషత్తుల ప్రకారము ఒక వ్యక్తి లేక జీవాత్మ, బాహ్యముగా కానీ లేక మానసికముగా కానీ చేసిన పనుల వలన సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది. లింగ శరీరము (అనగా బాహ్య శరీరమునకు మరియు ఆత్మకు మధ్య గలది) ఈ సంస్కారాలను తర్వాతి జన్మలకు తీసుకుని వెళుతుంది.ఈ విధముగా అపజయము ఎరుగని, తటస్థ, మరియు విశ్వ నియమము, ఐన కర్మ ఒక వ్యక్తి మరు జన్మకు, ఆ జీవాత్మ ఏ కుటుంబంలో పుట్టాలి అనేది నిర్ణయిస్తుంది. చర్య, ప్రతిచర్య, పుట్టుక, మరణము మరియు పునర్జన్మ అను చక్రాన్ని సంసారము అంటారు. హిందువుల ఆలోచన ప్రకారము కర్మకు, పునర్జన్మకు చాలా ప్రాముఖ్యత ఉంది.

భగవద్గీత ప్రకారము:
" చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. " ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది.చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.
జీవితము యొక్క పరమార్థము మోక్షము అనగా పరమాత్మతో ఐక్యము కావడము అని చెప్పబడుతోంది.అనగా ఆత్మ సాక్షాత్కారము, జీవేశ్వరుల ఐక్యత, ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత, అమాయకత్వము నుండి విడుదల మరియు పరిపూర్ణ మనశ్శాంతి. ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారము నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది. మోక్షానికి నిర్వచనములు హిందూ మతము లో పలురకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు "అద్వైతం" ప్రకారము మోక్షము పొందిన తర్వాత వ్యక్తిత్వము నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది. ద్వైతుల ప్రకారము జీవాత్మ అనేది పరమాత్మ లో ఒక భాగమని మరియు మోక్షము తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యము లో అనంతకాలము ఉంటామని భావిస్తారు. అయితే ద్వైతుల ప్రకారము మోక్షము అనగా " చక్కెరను రుచి చూడడము" , అద్వైతుల ప్రకారము " చక్కెర గా మారిపోవడము" అని అర్థము.

జీవన గమ్యాలు
హళెబీడు లోని హొయసలేశ్వర మందిరం లో త్రిమూర్తుల శిల్పాలు: బ్రహ్మ, విష్ణువు, శివుడు.
సంప్రదాయ హిందూధర్మము రెండు ముఖ్యమైన జీవిత కాల ధర్మాలను అంగీకరిస్తుంది: అవి గృహస్థ మరియు సన్యాస ధర్మాలు.

గృహస్థ ధర్మము నాలుగు విధాల పురుషార్థాలను భోధిస్తుంది. అవి
" కామము " : శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు
" అర్థము " : ధన సంపాదన మరియు కీర్తి
" ధర్మము" : మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము
" మోక్షము " : పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల
వీటిలో ధర్మము మరియు మోక్షము ప్రముఖమైనవి.] మోక్షమును పొందాలంటే కామము అనగా కోరిక మరియు ధనసంపాదన ధర్మయుక్తముగా ఉండాలి. సన్యాస ధర్మము అనగా మోక్షమును మాత్రము కోరుతూ మిగిలిన మూడు పురుషార్థాలను త్యాగము చెయ్యడము. గృహస్థుడు కూడా కాలాంతరములో దీనిని పొందుతాడు. అంతేకాక కొందరు మనుషులు పూర్వజన్మల సంస్కారాల వలన ప్రస్తుతము ఏ దశలో ఉన్నప్పటికీ వెంటనే సన్యాసస్థితిని పొందుతారు.

యోగము
జీవితంలో అనుసరించవలసిన నియమాలగురించీ, సాధించవలసిన లక్ష్యాలగురించీ వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్నియోగము అని అంటారు. ప్రతి మనిషి తన జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి యోగులు వివిధ రకాలైన పద్దతులను ఉపదేశించారు. వీటిలో ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అని అంటారు. భగవద్గీత, యోగ సూత్రాలు, హఠయోగ ప్రదీపిక మరియు వీటన్నింటికీ మూల గ్రంథాలైన ఉపనిషత్తులు యోగం కోసం అంకితమైనవి. ఎవరైనా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని (మోక్షం, సమాధి, లేదా నిర్వాణం)చేరుకోదలచిన వారు క్రింద పేర్కొన్న మార్గాలను అనుసరించ వచ్చు.
భక్తి యోగం (ప్రేమ మరియు భక్తి తో కూడిన మార్గం)
కర్మ యోగం (విధులను సక్రమంగా నిర్వర్తించడం )
రాజ యోగం (ధ్యాన మార్గం)
జ్ఞాన యోగం (జ్ఞాన సముపార్జన)

ఒక మనిషి తన ఇష్టాన్ని బట్టి లేదా అర్థం చేసుకొనే శక్తిని బట్టి ఈ నాలుగింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొనవచ్చు. కానీ కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ కలియుగం లో భగవంతునికి చేరువ కావడానికి భక్తి మార్గం కంటే మించిన మార్గం మరొకటి లేదని చెపుతుంటారు. ఒక మార్గాన్ని అనుసరించడం ద్వారా మరొక మార్గాన్ని అనుసరించకూడదని నియమమేమీ లేదు. ఉదాహరణకు జ్ఞాన యోగాన్ని శ్రద్ధగా ఆచరించడం ద్వారా పవిత్రమైన ప్రేమను కూడా సాధించవచ్చు. ధ్యాన యోగాన్ని అనుసరించేవారు తప్పని సరిగా కర్మ యోగం, జ్ఞాన యోగం మరియు భక్తి యోగ భావనల్ని ఇముడ్చు కోవాల్సి ఉంటుంది.
వివిధ యోగాల ఆచరణ గురించీ, వాటిలోని భేదాల గురించీ, వాటి మధ్యనున్న సమన్వయం గురించీ అనేక గ్రంధాలు, సూత్రాలు, అభిప్రాయాలు, ఆచారాలు ఉన్నాయి.

చరిత్ర
టిబెట్ లోని కైలాస పర్వతం పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానంగా హిందువులకు పవిత్రమైనది.
క్రొత్త రాతియుగం నుండి హరప్పా మొహంజొదారో నాగరికత కాలం వరకు హిందూమతం గురించిన పురాతన ఆధారాలు ఉన్నాయి.(5500–2600BCE).(1500–500BCE) కాలానికి చెందిన అంశాలను 'చారిత్రిక వైదిక ధర్మం'కు చెందినవని అంటారు.

వేదాల ఆవిర్భావం నుండి హిందూమతం ఆచారాలు, సిద్ధాంతాలలో ఏర్పడిన స్పష్టత ఇప్పటికీ కొనసాగుతున్నది. వీటిలో అతి పురాతనమైన ఋగ్వేదం 1700–1100 BCE కాలానికి చెందినదని ఒక అభిప్రాయం. వేదాలలో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వంటి దేవతల ఆరాధన, సోమయాగం వంటి యజ్ఞకర్మలు బహుళంగా చెప్పబడ్డాయి. విగ్రహారాధన కంటే మంత్రారాధన, యజ్ఞకాండలు వేదసాహిత్యంలో ప్రాముఖ్యత వహిస్తాయి. ఋగ్వేదంలోని ఆచారాలు, విశ్వాసాలు జొరాస్ట్రియన్ మతానికి కొంత సారూప్యం కలిగి ఉన్నాయి.

వేదాల తరువాతి కాలాన్ని పురాణాల కాలం గా పేర్కొంటారు. వీటిలో మొదటివైనరామాయణం, మహాభారతం 500–100BCE, కాలంలో రూపుదిద్దుకొన్నాయి. తరువాత అనేక పురాణాలు వెలువడ్డాయి. పురాణాలలోని వివిధ అంశాలు నేటి హిందూమతాచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలకు ప్రధాన ప్రమాణాలు.

హిందూ మతాన్నీ, అందులోని నమ్మకాలనూ మౌలికంగా ప్రభావితం చేసి, క్రొత్త పరిణామాలకు దారితీసిన మూడు ముఖ్యాంశాలు - ఉపనిషత్తులు, జైన మతము, బౌద్ధ మతము వీటిలో వేదాల సాధికారతను, వర్ణ వ్యవస్థ బంధాన్ని అంగీకరించకుండా మోక్షము లేదా నిర్వాణం పొందడం గురించి చెప్పబడింది. గౌతమ బుద్ధుడు మరింత ముందుకు వెళ్ళి ఆత్మ లేదా భగవంతుడు అన్న నమ్మకాలను ప్రశ్నించాడు.మౌర్యుల కాలంలో బౌద్ధం దేశమంతటా వర్ధిల్లింది (క్రీ.పూ 300 నుండి క్రీ.శ. 200 వరకు). తరువాత వివిధ వేదాంత దర్శనాలు అనేక విధాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. వీటిలో క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి చార్వాకుని నాస్తిక వాదం కూడా ఒకటి.క్రమంగా మళ్ళీ బౌద్ధమతాన్ని అణగద్రొక్కి హిందూమతం క్రీ.పూ. 400 నుండి క్రీ.శ. 1000 కాలంలో బలపడింది.
క్రీ.శ. 7వ శతాబ్దంలో భారత దేశంలో అరబ్బు వర్తకుల ద్వారా ప్రవేశపెట్టబడిన ఇస్లాం మతం తరువాత ముస్లిం పాలనా సమయంలో దేశమంతటా విస్తరించింది. ఈ కాలంలో రెండు మతాల మధ్యా వివిధ స్థాయిలలో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో సహ జీవన విధానాలు కూడా అభివృద్ధి చెందాయి. తరువాతి కాలంలో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్యుడు వంటి ప్రవక్తల బోధనల వల్ల హిందూమతంలో మరికొన్ని నూతన విధానాలు నెలకొన్నాయి.

అస్తిత్వం (ఉనికి)
పూర్వం టిబెట్, వియత్నామ్ దేశాలలో కూడా హిందూ మతం ఉనికిలో ఉండేది. భారత్, నేపాల్, బాలి ద్వీపం(ఇండోనేషీయా)లలో హిందూ మతం ఇప్పటికీ బలంగా స్థిరపడి ఉంది.

వేదాలు మరియు వేదాంత శాస్త్రము
హిందూ మతానికి ఆధారభూతమైనటువంటి ఆధ్యాత్మిక నియమాలు వేర్వేరు కాలాలలో వేర్వేరు వ్యక్తులచే ఏర్పరచబడ్డాయి. వేదాలను గ్రంథస్తం చేయక మునుపు కొన్ని శతాబ్దాలపాటు కేవలం శ్రవణం ద్వారానే భోదించబడేవి. కొన్ని శతాబ్దాలపాటు కృషి చేసి మహర్షులు భోధనలను మరియు నియమాలను విస్తృత పరచారు. వేదాలను రచించినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ గ్రంథాలను కేవలం సాహిత్య పరంగా కాక వాటికి నీతి నియమాలను జోడించి అర్థం చేసుకుంటున్నారు. చాలావరకు పవిత్ర గ్రంథాలు సంస్కృతం లోనే ఉన్నాయి. వీటిని స్మృతిపురాణాలనీ మరియు శృతి పురాణాలని విభజించవచ్చు.

హిందూ మతం యొక్క మొట్టమొదటి గ్రంథాలైన వేదాలు శ్రుతులకిందకు వస్తాయి. వేదాలను హిందూ ప్రజలు ప్రాచీన ఋషులు కనుగొన్న శాశ్వత సత్యాలుగా కీర్తిస్తారు. కొద్ది మంది భక్తులు మాత్రం వేదాలు ఏ ఒక్కరో లేక భగవంతుడే ఏర్పరిచినట్లు భావించక అన్ని కాలాలలోనూ ఆచరించదగిన ఆధ్యాత్మిక నియమాల సారంగా భావిస్తారు. కాలగమనంలో వేదాలకు కొత్త కొత్త భాష్యాలు పుట్టుకొస్తున్నాయి.

వేదాలు నాలుగు. అవి (1) ఋగ్వేదము, (2) సామవేదము, (3) యజుర్వేదము, (4) అధర్వణవేదము.అన్నింటికన్నా మొట్టమొదటిది మరియు ముఖ్యమైనది ఋగ్వేదము. ప్రతి ఒక్క వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని సంహిత అంటారు. ఇందులో పవిత్రమైనటువంటి మంత్రాలు లిఖించబడి ఉంటాయి. మిగతా మూడు భాగాలలో వ్యాఖ్యానాలు ఉంటాయి. సంహితం కన్నా ఇవి కొంచెం ఆలస్యంగా రచింపబడి ఉండవచ్చునని పండితుల భావన. మిగతా మూడు బ్రాహ్మనలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మొదటి రెండు భాగాల్ని కర్మకాండలు అనీ తరువాతి రెండు భాగాలను జ్ఞానకాండలు అనీ పిలుస్తారు. కొన్ని భాగాలు కర్మకాండలను గూర్చి ప్రస్తావిస్తే ఉపనిషత్తులు ఆధ్యాత్మిక థృక్కోణాన్ని, తత్వశాస్త్ర భోధనలను, మరియు బ్రహ్మము, పునర్జన్మను గూర్చి ప్రస్తావిస్తాయి.

ఇక స్మృతి పురాణాలనగా గుర్తుంచుకొన్నవి. వీటిలో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు అతి ముఖ్యమైనవి. అత్యంత ప్రాముఖ్యం పొందిన హిందూ మూలగ్రంథం భగవద్గీత మహాభారతంలోని అంతర్భాగం. మహాభారత సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవ రాజకుమారుడైన అర్జునునకు ఉపదేశించిన సర్వ వేదాల సారాంశమే గీతాశాస్త్రం. పురాణాలు వివిధ రకాలుగా హిందూ భావజాలాన్ని వ్యక్తీకరిస్తాయి. ఇంకా దేవీ భాగవతం, తంత్రాలు, యోగ సూత్రాలు, తిరు మంత్రం, శివ స్తోత్రాలు, ఆగమ పురాణాలు స్మృతుల కిందకు వస్తాయి. వివాదాస్పదమైన మనుస్మృతి కుల వ్యవస్థను గూర్చి వివరిస్తుంది.

ఆరాధనా విధానాలు
స్వస్తిక చిహ్నంఈశ్వరాన్వేషణ, మరియు దేవుని కృపకై కృషి హిందూ పద్దతులలో ప్రధానమైన భాగాలు. అందువల్లనే హిందువులు దైనందిన జీవనంలో కూడా భవగవంతుని తలుచుకొనడానికి కొన్ని పద్దతులు ప్రవేశ పెట్టారు. హిందువులు తమ ఇళ్ళలో ప్రతిష్టించుకొని కానీ లేక దేవాలయాలలో కానీ తమ ఇష్ట దైవాన్ని ఆరాధించవచ్చు. మామూలుగా ఆలయాలలో ప్రధాన దైవం మరియు ఇతర దేవుళ్ళు కొలువై ఉంటారు. దేవాలయాలకు వెళ్ళడం ఖచ్చితమైన నియమమేమీ కాదు. చాలామంది కేవలం పండుగ రోజులలో మాత్రమే ఆలయాలను సందర్శిస్తుంటారు. సాధారణంగా హిందువులు విగ్రహాన్ని దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆ విగ్రహాన్నే తమకు మరియు భగవంతునికి వారధిగా భావిస్తారు.ఈ విగ్రహాన్ని కేవలం రాయిగా కాక సాక్షాత్ భగవత్స్వరూపంగా భావించాలని పద్మ పురాణం చెపుతోంది. ఆర్య సమాజ్ లాంటి వారు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు.






హిందూమతంలో చిత్రకళలోనూ, వాస్తులోనూ, సాహిత్యంలోనూ, మరియు పూజలలో ఆధ్యాత్మికతను ప్రతిబింబించడానికి కొన్ని సంకేతాలను ఏర్పాటు చేశారు. పురాణాలనుంచి, వేదాలనుంచి, మరియు సాంప్రదాయాలను అనుసరించి ఒక్కో సంకేతం ఒక్కో అర్థాన్ని సంతరించుకుంటాయి. ఉదాహరణకు ఓం సంకేతం పరబ్రహ్మ స్వరూపం. స్వస్తిక్ గుర్తు శుభసంకేతం. తిలకం ఒక విశ్వాసాలను అనుసరించేవారిని సూచిస్తాయి. ఇంకా పద్మం, చక్రం, వీణ ఇతర సంకేతాలను సూచిస్తాయి.


మంత్ర పఠనం భగవంతుని కీర్తించడానికి, సేవించడానికి, ప్రార్థించడానికి, తమ భక్తిని తెలపడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. చాలామంది భక్తులు పుణ్య నదుల దగ్గర గాయత్రీ మంత్రం,మహామృత్యుంజయ జపం పారాయణం చేస్తుంటారు. మహాభారతం' జపాన్ని' కలియుగం(ప్రస్తుతం నడుస్తున్న యుగం)లో అత్యుత్తమ ధర్మంగా అభివర్ణిస్తోంది. జపాన్ని ప్రధాన ఆధ్యాత్మిక పద్దతిగా స్వీకరించిన వారు చాలామంది ఉన్నారు.

ఉత్సవాలు, ఆచారాలు, ధర్మ కర్మ విధులు
చాలామంది హిందువులు తమ ఇళ్ళలో ప్రతిరోజూ దీపారాధన, నైవేద్యం, వేద పారాయణం, దేవుని స్తోత్రాలు మరియు మంత్ర పఠనం, ధ్యానం మరియు ఇతర పూజా కార్యక్రమాలు వంటి వాటిని నిష్ఠగా నిర్వహిస్తుంటారు. ఈ ఆచారాలు, వ్యక్తిని బట్టి, గ్రామాలను బట్టి, మరియు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాలలో గుర్తించదగిన విషయం ఏమిటంటే ఇవి ఆచరించే ముందు ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా పరిశుద్ధులై ఉండాలి. అందుకే స్నానం ఆచమనీయానికి అతి ముఖ్యమైనది. త్యాగం ద్వారా, దాన ధర్మాల ద్వారా మూటకట్టుకొన్న పుణ్యం మరుజన్మలో ఉపయోగపడుతుందని హిందువులు విశ్వసిస్తారు. యజ్ఞ యాగాదుల గూర్చి పురాణాలలో గొప్పగా కీర్తించారు. కానీ ఈ కాలంలో ఇవి తరచుగా నిర్వహించనప్పటికీ పెళ్ళిళ్ళలోనూ, కర్మకాండలలోనూ యధావిధిగా నిర్వర్తిస్తుంటారు





పుట్టినరోజు, పెళ్ళి, మరణం మొదలైనవి మతసాంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఉదాహరణకు అన్నప్రాసన రోజు బిడ్డకు మొట్టమొదటిసారిగా ఘనాహారం తినిపిస్తారు. ఉపనయనం రోజు జంధ్యాన్ని తొడుగుతారు. ఒక మనిషి చనిపోయిన తరువాత అతని దినం రోజున విందు పెడతారు. పెళ్ళి ఏ రోజున జరగాలనే ముహూర్తాన్ని వధూవరుల జాతక చక్రాన్ని బట్టి తల్లిదండ్రులు జ్యోతిష్కులచే నిర్ణయిస్తారు. సన్యాసులకు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, మరియు హిజ్డాలకు తప్పించి మిగతా వారందరికి సాంప్రదాయకంగా కర్మకాండలు జరుపుతారు. శవాన్ని నేలలో పూడ్చడాన్ని ఖననం అంటారు. కాల్చడాన్ని దహనం అంటారు. ఇవి చేసేముందు శవాన్ని తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచుతారు.


యాత్రలు, పండుగలు
పుణ్య క్షేత్ర సందర్శన హిందూమతంలో తప్పనిసరి కానప్పటికీ చాలామంది భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను భక్తి ప్రపత్తులతో దర్శించి వస్తుంటారు. వీటిలో అలహాబాదు, హరిద్వార్, వారణాసి, బృందావనం ముఖ్యమైనవి. ఇంకా ఒడిషా రాష్ట్రంలో కల పూరీ జగన్నాథుని ఆలయం,రథ యాత్ర, ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, తిరుపతి (కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర సన్నిధి), జమ్ము కాశ్మీర్ లోని కట్రా దేవాలయం ప్రసిద్ధి గాంచినవి. పూరీ, రామేశ్వరం, ద్వారక, బద్రీనాథ్ లను పుణ్యక్షేత్ర వలయంగా పేర్కొంటారు. ఇంకా నాలుగేళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాకు భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ మేళా అలహాబాదు, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో ఒక్కోసారి ఒక్కోచోట జరుగుతుంటుంది. ఇంకా చెప్పుకోదగ్గవి శక్తి పీఠాలు (కాళీఘాట్, మరియు కామాక్షి దేవాలయం). వీటిలో ఆదిశక్తిని ఆరాధిస్తారు.

హిందువులు ఒక సంవత్సరంలో చాలా పండుగలు జరుపుకుంటారు. చాలా పండుగలు హిందూ పురాణాల ప్రకారం ఏదో ఒక చరిత్ర కలిగి ఉంటాయి. కొద్ది మంది మాత్రమే జరుపుకొనే పండుగలు కూడా కొన్ని ఉంటాయి. దసరా, దీపావళి, వినాయక చవితి, మహాశివరాత్రి, శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి, హోలీ మొదలైనవి ప్రధానమైన పండుగలు.





పరమాత్మ స్వరూపం
హిందూ మతంలో భగవంతుని స్వరూపం మరియు సృష్టి గురించి భాగవతంలోని ద్వితీయ స్కందంలో శుకమహర్షి పరీక్షిత్మ్హారాజుకు చెప్పాడు.భగవంతుడిని పరమేశ్వరుడని,విరాట్పురుషుడని ఇంకా అనేక పేర్లతో హిందూమతం వర్ణిస్తుంది.భగవంతుడు శాశ్వతుడు అంత్యకాలంలో సృష్టి ఆయనలో లీనమౌతుంది.తిరిగి భగవంతుని నుండి సృష్టి అనేకరూపాలతో ఆయననుండి ఉద్భవిస్తుంది.హిరణ్యమయమైన భగవంతుని శరీరంనుండి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని మూడు విధాలుగా ఈ జగతిని సృష్టించాడు.పరమాత్మ శరీరంలోని ఆకాశంనుండి ప్రవృత్తి సామర్ధ్యమైన ఓజస్సు,వేగ సామర్థ్యం,బలసామర్థ్యం ఉద్భవించాయి.ఆయనలోని సూక్ష్మరూపమైన క్రియాశక్తి వలన ప్రాణం పుట్టింది.ఆ ప్రాణం సమస్త జీవరాశిలో ప్రాణశక్తిగా ఉంది.భగవణ్తుని జఠరాగ్ని నుండి ఆకలి దప్పిక పుట్టాయి.పరమాత్ముని ముఖంనుండి నోరు,నాలుక,దవడలు పుట్టుకొచ్చాయి.నాలుక నుండి రసేంద్రియాలు ఉద్భవించాయి.ఆయన ముఖం నుండి వాగేంద్రియం పుట్టింది.వాగేంద్రియానికి అగ్ని దేవుడు అధిష్టాన దేవత అయ్యాడు.వాగేంద్రియం నుండి సంభాషించే శక్తి పుట్టింది.ఆయనలోని వాయు శక్తి నుండి ఘ్రాణేంద్రియం పుట్టింది.ప్రాణులకు వాసనా శక్తి వచ్చింది.ఘ్రాణేంద్రియానికి వాయువు అధిష్టాన దేవత అయ్యాడు.పరమాత్మ ఆత్మను అవలోకించగానే నేరాలు పుట్టాయి.నేత్రాల నుండి చూసే శక్తి వచ్చింది.నేత్రాలకు సూర్యుడు అధిదేవత అయ్యాడు.దిక్కులు అధిష్టాన దేవతగా కర్ణేంద్రియాలు పుట్టాయి.పరమాత్మ నుండి చర్మం పుట్టింది .దానికి స్పర్శా శక్తి వచ్చింది.చర్మం నుండి వెండ్రుకలు పుట్టాయి.వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి.ఆ త్ర్వాత వాయువు నుండి చేతులు ఉద్భవించాయి వాటికి ఇంద్రుడు అధి దేవత అయ్యాడు.ఆ తరువాత పాదాలు పుట్టాయి.పాదాలకు విష్ణువు అధిదేవత అయ్యాడు.పరమాత్మఆనందపారవశ్యుడు కాగానే జననేంద్రియాలు పుట్టాయి.జననేంద్రియాల నుండి పునరుత్పత్తి శక్తి ఆవిర్భవించింది.జననేంద్రియాలకు ప్రజాపతి అధిష్టాన దేవత అయ్యాడు.మిత్రుడు అధిష్టాన దేవతగా పాయువు పుట్టింది.దానికి నిస్సార పదార్ధాలను విసర్జించే శక్తి పుట్టింది.జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరించాలన్నప్పుడు మొదటి శరీరాన్ని వదలటానికి సాధనంగా బొడ్డు ఉపయోగపడుతుంది.ప్రాణ ఆపాన వాయువులు శరీరాన్ని వదిలి వేయగానే మృత్యువు సంభవిస్తుంది.క్రింది శరీరాన్ని పై శ్రీరాన్ని వేరు చేస్తూ మధ్య భాగంలో బొడ్డు ఉంటుంది.ఆ హారాన్ని జీర్ణం చేయడానికి ప్రేవులు,రక్తప్రసరణ ఇతర కార్యాలకు నాడీ వ్యవస్థ అవతరించాయి.వాటికి నదీ నదములు అధిష్టాన దేవతలు అయ్యాయి.పరమాత్మ ఒకసారి మాయను ధ్యానించగానే కామానికి,సంకల్పానికి నెలవైన హృదయం జనించింది.హృదయం నుండి సంకల్పం,బుద్ధి,చంద్రుడు,కాముడు జనించాయి.విరాట్పురుషుడి స్థూల శరీరం భూమి తేజస్సు,వాయువు,ఆకాశం,అహంకారం,మహత్తత్వం,అవ్యక్తం అనే ఎనిమిది అనే ఎనిమిది ఆవరణలతో ప్రకాశిస్తుంది.ఇలా శుకమహర్షి పరీక్షిత్తు భాగవతంలో భగంతుని గురించి సృష్టి గురించి వివరించాడు.




ఆశ్రమాలు
హిందువుల ఆచారం ప్రకారం హిందువుల జీవనం నాలుగు ఆశ్రమాలుగా విభజించ బడి ఉంది.
మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, విద్యార్థిగా, బ్రహ్మచారిగా, నియమబద్దులై, ప్రశాంతంగా గురువు అదుపాజ్ఞలలో ఉంటూ ఆధ్యాత్మిక సంపత్తి కొరకై మనసును సిద్దం చేసే దశ. రెండోది గృహస్థ్యాశ్రమం. ఇందులో పెళ్ళి ద్వారా మరియు తమ వృత్తుల ద్వారా కామాన్ని సంతృప్తి పరచడం మరియు అర్థాన్ని(డబ్బు) సంపాదించడం ముఖ్యమైనవి. ఇంకా తల్లిదండ్రులను,పిల్లలను, అతిథులను,పెద్దలను ఆదరించడం హిందువుల యొక్క విధులు. మూడోది వానప్రస్థం. నెమ్మదిగా ఈ ప్రపంచంతో బంధాలను తెంచుకోవడం, భాధ్యతలు పిల్లలకు అప్పగించి తీర్థ యాత్రలు చేయడం ప్రధానమైనవి. ఇక చివరిదైన సన్యాసాశ్రమంలో ఈ ప్రపంచంతో బంధాలన్నింటినీ తెంచుకుని మోక్ష సిద్ధి కొరకు దేహ త్యాగం చేయడం.

సన్యాసం
మోక్ష సాధనకు మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కొద్దిమంది సన్యాసాన్ని స్వీకరిస్తారు. సన్యాసాన్ని స్వీకరించిన వారు, నిరాడంబర జీవనం, బ్రహ్మచర్యం, ఐహిక సుఖములపై అనాసక్తి, భగవంతునిపై నిశ్చల భక్తిని తమ జీవన విధానంగా మలుచుకుని ఉంటారు. వీరిని సన్యాసులు, సాధుపుంగవులు, లేదా స్వాములని పిలుస్తారు.సన్యాసం స్వీకరించిన మహిళలను సన్యాసినులు అంటారు. ఈ సన్యాసుల పట్ల హిందూసమాజం అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉంటుంది. ఎందువల్లనంటే వారు స్వార్థం, మరియు ఇంద్రియ సుఖములందు అనాసక్తులై ఉంటారు. కొద్ది మంది ఆశ్రమాల్లో తమ జీవనం కొనసాగిస్తుంటారు, కొద్ది మంది మాత్రం తమ అవసరాలను ఆ సర్వేశ్వరుడే తీరుస్తాడని దేశ సంచారం చేస్తుంటారు. సన్యాసుల తిండి మొదలైన అవసరాలు తీర్చడం గృహస్తులు గొప్పగా భావిస్తుంటారు. సాధువులు పేద-ధనిక, మంచి-చెడు,తేడా లేకుండా అందరిపై సమదృష్టి కలిగి ఉంటారు. పొగడ్తలకు, నిందలకు, సంతోషాలకు, భాధకు చలించకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటారు.

వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థ
హిందూ సమాజం సాధారణంగా నాలుగు వర్ణాలుగా విభజింపబడి ఉంది.
బ్రాహ్మణులు (ఆచార్యులు మరియు పూజారులు)
క్షత్రియులు (యోధులు, రాజులు, మరియు ఉన్నత వంశానికి చెందిన వారు)
వైశ్యులు (వ్యాపారస్థులు మరియు వాణిజ్యవేత్తలు)
శూద్రులు (కూలివారు మరియు సేవకులు)
ఈ వర్ణ వ్యవస్థ, హిందూమతం యొక్క అంతర్భాగమా? లేక కాలం చెల్లిన సామాజిక సాంప్రదాయమా? అన్న విషయంపై ఇప్పటికీ పండితుల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఋగ్వేదం (10.90)లో వర్ణ వ్యవస్థ గురించి స్పష్టం చేసి ఉన్నప్పటికీ కుల వ్యవస్థ మతంలో విడదీయరాని భాగంగా ఉండనవసరం లేదని కొన్ని చోట్ల సూచనలు ఉన్నాయి.
వేద కాలపు నాగరికతలో తరువాతి కాలంలాగే శూద్రులు వేదాలను వినకూడదనే కట్టుబాట్లు ఏమీ లేవు. వర్ణ వ్యవస్థలో కొన్ని వెసులుబాట్లు ఉండటం మూలాన కొద్ది మంది సామాజిక శాస్త్రవేత్తలు వాదనలు బలంగా లేవు.
మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి సంఘ సంస్కర్తలు వర్ణ వ్యవస్థను నిరసించారు. ఆధ్యాత్మిక గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ఈ విషయంపై ఒక శ్లోకం చెప్పాడు.
"భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు.... ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాజాలడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు."

అహింస మరియు శాకాహారము
హిందువులు సృష్టి లోని సకల జీవజాతులు జీవించడానికి సమాన హక్కు కలిగివున్నాయని భావించడం వలన అహింసను పరమావధిగా భావిస్తారు. ఈ అహింస అనే పదం ఉపనిషత్తు లలో కనిపిస్తుంది. అంతే కాక మహాభారతం లోను మరియు పతంజలి యోగసూత్రాలలో ఈ పదం గూర్చిన ప్రస్తావన ఉంది.[
అహింసను పాటించేవారు శాఖాహారులై ఉంటారు. మిగతా వారికి శాకాహారం తప్పనిసరి కానప్పటికీ సాత్వికంగా జీవించాలనుకొనే వారికి ముఖ్యమైనది. ఒకానొక అంచనా ప్రకారం భారతదేశం లో 20% శాతం నుంచి 42% వరకు శాఖాహారులున్నారు.30% శాతం మంది మాంసాహారులు కూడా అప్పుడప్పుడే భుజిస్తుంటారు. ఆహారపు అలవాట్లు జాతిని బట్టి మరియు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.ఉదాహరణకు కొన్ని కులాలలో ఎక్కువ మంది, కొన్ని కులాలలో తక్కువ మంది మాంసాహారులు ఉండవచ్చు. కొందరు హిందువులు ఉల్లిని, వెల్లుల్లిని రజోగుణము కల పదార్ధాలుగా భావించి తినరు. కొద్ది మంది హిందువులు కొన్ని ప్రత్యేక దినములలో మాంసాహారాన్ని ముట్టరు.
మాంసాహరాన్ని స్వీకరించినా చాలావరకు హిందువులు పశు మాంసాన్ని మాత్రం ముట్టరు. హిందువులు పాల కోసం, దుక్కి దున్నడం కోసం, మరియు ఎరువుల కోసం ఆవులు లేదా ఎద్దుల మీద చాలావరకు ఆధార పడతారు. అందువల్లనే హిందువులు ఆవును మాతృసమానంగా,కల్పవృక్షం గా భావించి పూజిస్తారు. భారతదేశం లోని చాలా రాష్ట్రాలలో గోవధ చట్టరీత్యా నేరం.

మతం మారటం
హిందూ మత పురాణాలు మత మార్పిడిని గూర్చి ఏమీ ప్రస్తావించకపోవడం మూలాన ఒక హిందువు మతం మారవచ్చా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. కానీ హిందూ మతాన్ని ఒక తత్వంగా, లేదా ఒక జీవన విధానంగా భావించేవారు, హిందూ నమ్మకాలను తమ జీవన విధానంలో ఇముడ్చుకున్నవారు ఎవరైనా హిందువులు కాగలరని చెబుతుంటారు. కొద్ది మంది మాత్రం హిందూ మతాన్ని ఒక జాతిగా పరిగణించడం వలన హిందువులకు జన్మించినవారు మరియు భారతదేశంలో జన్మించిన వారే హిందువులు కాగలరని విశ్వసిస్తారు. కానీ భారతదేశపు ఉత్కృష్ట న్యాయస్థానం మాత్రం, జాతి, వారసత్వాలతో ప్రమేయం లేకుండా, హిందూమత విశ్వసాల్ని అవలంబించే ఎవరినైనా హిందువులుగా పరిగణించవచ్చునని తెలుపుతోంది. చాలా సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక జీవనం దీక్ష అనే ప్రక్రియతో ప్రారంభమౌతుంది. కానీ హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేక పద్దతులంటూ ఏమీ లేవు. ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం. అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. అయినప్పటికీ కొన్ని హిందూ మత సంస్థలైన వేదాంత సమాజం, ఇస్కాన్, ఆర్య సమాజ్ మున్నగునవి విదేశాలలో హిందూమత ప్రాశస్థ్యాన్ని గూర్చి ప్రజలకు వివరించి మార్గ నిర్దేశం చేస్తుంటాయి.


హాలీవుడ్‌ నటి జూలియా రాబర్ట్స్(42) హిందూమతం స్వీకరించి భర్త డేనియల్‌ మోడర్‌, ముగ్గురు పిల్లలతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నట్లు తెలిపారు.జూలియా తల్లిదండ్రులు కేథలిక్కులు.



No comments:

Post a Comment