Thursday 28 July 2016

స్త్రీలు గాజులు ఎందుకు ధరిస్తారు?

స్త్రీలు గాజులు ఎందుకు ధరిస్తారు?


గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు, రంగు గాజులను ధరించి ఫ్యాషనబుల్గా కనిపించడానికి ప్రయత్నిస్తాం. అలాగే చేతినిండా బంగారు గాజులు ధరించి, వాటిని ఆస్తిగా పరిగణిస్తాం. అయితే గాజులు ధరించడం అనే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా?
గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి.
దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. ఇందుకు తప్పనిసరిగా గాజులనే ధరించాలా? ప్రత్యామ్నాయం లేదా అంటే.. ఉంది. రోజూ కొంతసేపు మణికట్టు-ముంజేతి మధ్య చేత్తో నొక్కుకొవచ్చు. అలాగని మర్దన చేసినంత ఒత్తిడి పడకూడదు. కాబట్టి ఒకరకంగా అలంకరణకు గాను, ఆరోగ్య సాధనంగాను ఉపకరించే విధంగా డిజైన్ అయినవే ఈ గాజులు.

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?
చేతికి గాజులందము...చెంపకు సిగ్గులందము’ అన్నాడో సినీ కవి. నిజమే...లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు. గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి.

బాలికలను, వివాహం అయిన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా గౌరవించడం మన సంప్రదాయం. లక్ష్మీత్వంగల మంగళ ద్రవ్యాలుగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు సూచించారు. ఈ మంగళ ద్రవ్యాలను ధరించడం వలన లక్ష్మీ ప్రదమైన చిహ్నాలు మరింత పెరుగుతాయి. అంతేగాక, లక్ష్మీని అంటే స్త్రీని కాపాడవలసిన బాధ్యత కూడా వుందని స్త్రీకి రక్షణ కూడా కల్పించడమ్ జరిగింది. అంతేకాక గాజులు ధరించడం ఆరోగ్యప్రదమైనది.
ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు. ‘జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుంది’ అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.

అయితే..‘ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదా’ అనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు. కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని ‘గృహలక్ష్మి’ అని గౌరవించారేగానీ.. పురుషుని ‘గృహవిష్ణువు’ అని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు...పెద్దలు. మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది.


చిన్నతనంలోనే...
మనిషి పుట్టిన చిన్నతనంలోనే చిన్నారికి ఎలాంటి దిష్టి తగల కూడదంటూ... అడైనా, మగైనా సరే నల్లని పూసలతో చేసిన గాజులని, నల్ల గాజుల్ని చేతులకు వేయటం జరుగుతుంది.


క్షేమం కోసం...
నిండుగా గాజులు వేసుకుని కళకళలాడుతూ ఉంటే... ఐదవ తనం పదికాలాల పాటు వర్ధిల్లుతుందన్న నమ్మకం. మాంగల్యం పచ్చగా నిలవాలని... తమ కుటుంబ మంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మహిళలు గాజులను నోములు, వ్రతాల పేరుతో...దానంగా ఇవ్వ టం జరుగుతూ వస్తోంది. అలాగేనిశ్చయతాం బూలా లు, వివాహం, పెళ్లి పనులు ప్రారంభించే ముందు పసుపుకొట్టడం ఇలా ప్రతి కార్యక్రమంలోనూ ముత్తయి దువలకు గాజులు ఇవ్వటం ద్వారా ఆ కుటుంబానికి మంచి జరుగుతుందన్న భావన నేటికీ ఉంది.


గాజుల గలగలలు...
అసలు పండగలు, పెళ్లి పేరెత్తితేనే... గాజుల గల గలలు లేకుండా జరగదనే చెప్పాలి. ఆయా పండ గలో, సందర్భానుసారంగా తీసే దుస్తులకు తగ్గ మ్యాచింగ్ గాజులు లేకుంటే ఆవస్త్ర అలంకరణ పూర్త వ్వదనే భావన నేటికీ మహిళల్లో ఉంది. అందుకే బంగారు గాజులు ఎన్ని ఉన్నా వాటి నడుమ అందా లలికిస్తూ... గలగలలాడే రంగు రంగుల మట్టిగాజు లు, లక్కగాజులు ముంజేటి మీద నాట్యం చేస్తూ... తమ హుందా తనాన్ని నిలుపుతుంటాయి. గాజుల అందాలను అలంకరించుకుని మురిసిపోని వారు. వాటి గల గలలు వింటూ మైమరచిపోని మహిళలు ఎవరైనా ఉంటారా? వీటిని ధరించేందుకు మతం, కులం, భాషా భేదాలు, ప్రాంతీయ, ధేశీయ భేదాలు అస్సలు లేవనటం సమంజసమే....


సీమంతంలో...
హిందూ సాంప్రదాయాలలో గర్భిణీ స్త్రీలకు జరిగే ప్రత్యేక కార్య క్రమం సీమంతం. పెళ్లయిన ఆడపిల్ల...కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. చేతలు నిండుగా గాజులువేసి... పండంటి బిడ్డని ప్రసాదించమని వేడు కుంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఇలా సీమంతం నిర్వహించడం వెనుక కార ణాలను. గర్భిణీగా ఉన్న స్త్రీ చేతి నరాలు చాలా వర కు బిగిం చుకుపోతాయని... ఇవి గర్భకోశం మీద కూడా ప్రభావం చూపే అవకా శాలుండటం వల్ల... గాజులు తొడగటం వల్ల చేతినరాలపై వత్తిడి పెరుగు తుందని... తద్వారా గర్భ కోశంపై సరైన వత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని విశ్వా సంతో మనపూర్వీకులు ఈ సీమంతం ప్రక్రియని ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెప్తారు. అనేక రంగుల గాజులని నెల లు నిండిన గర్భిణీకి సీమంతం రోజున తొడుగు తారు. ఇందులో ఓ చేతికి 21 మరో చేతికి 22 జత గాజుల్ని వేస్తారు వచ్చే పేరంటాళ్లు, బాలింతకు ఎర్రని గాజులు, పచ్చని గాజులు వేస్తే మంచి జరుగు తుంధని భావిస్తునే కొక్కేలతో ఉండే బంగారు, వెండి గాజులు ధరింప చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రసవ సమయంలో చేతులు ఉబ్బితే ఇబ్బంది లేకుండా తీసేసందుకు వీలు కలుగుతుం దని ఓ నమ్మకం.



ఆరోగ్యానికీ....
గాజులు ఆరోగ్యాన్ని ఇస్తాయంటే ఆశ్చర్యం కలుగు తోందా? కానీ ఇది వాస్తవం. గాజుల గలగలలు శరీ రానికి ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయో...మనిషికి మానసికానందం కలిగించడమే కాకుండా... మెదడు ను చురుకుదనం కలించేందుకు కూడా ఉపయోగ పడతాయని అందువల్ల వారిలో నూతనో త్సాహం గాజుల శబ్ధం విన్నప్పుడు కలుగుతుందని మరి కొందరు చెప్తారు. గాజు నాడీ మండలాన్ని నియం త్రించి రక్తపోటుబారిన పడకుండా నియంత్రిస్తుంది. అందువల్లే బి.పితో బాధపడే వారిని చేతికి రాగి, ఇత్తడి, పంచలోహాలతో చేసిన గాజు ఆకారంలో రూపొందే వాటిని ధరించమని నిపుణులు చెప్తుంటారు. అంటే అసలు గాజు రూపకల్పనలోనే మన పూర్వీ కులు వైద్యపరంగా కూడా ఎన్నో ఆలోచనలు చేసాకే రూపొందించారని తెలుస్తోంది కదా?


మనస్ధత్వం చెప్పేస్తాయి...
మగువుల మనస్ధత్వాన్ని గాజులు స్పష్టంగా చెప్పేం దుకు ముందుంటాయంటే ఆశ్చర్యం కలగకమాన దు. రెండు చేతులకీ 3,4 గాజులు వేసుకుని సింపుల్ గా కనిపించే మహిళ మంచి పొదుపరి అని అర్ధం. ఓ చేతికి మాత్రమే గాజులు వేసుకుని... మరో చేతికి వాచ్ లేదా.. బ్రాస్ లెడ్ తొడిగిన మహిళ అయితే .. ఓ వైపు సంప్రదాయానికి విలువ ఇస్తునే... మరోవైపు నవీన భావాలను ఆహ్వానించే మనస్ధత్వం ఆమెకుం దని చెప్పవచ్చట. చేతికి పరిపుష్టంగా గాజులు వేసుకున్న వారు... అం దులో రత్నాలు పొదిగినట్లు కనిపిస్తే.. అలాంటి వ్యక్తి పూర్తిగా సంప్రదాయాలను పాటించేందుకు ఇష్ట పడేతత్వం ఉన్నదని చెప్పవచ్చు. ఇక చేతికి గాజులే ధరించ కుండా అడపాదడపా నచ్చిన వాటినే గాజు లుగా ధరిస్తూ కనిపించే మగువలు పూర్తిగా ఆధునికత వైపు పరుగులు తీస్తు సంప్రదాయంని కాస్త వెనక్కి నెట్టినా పర్వాలేదన్న ధోరణి ఉన్న వారని అర్ధం చేసుకోవచ్చు.


గాజులు...తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి….
ఎరుపురంగు గాజులు శక్తిని, నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని, పసుపురంగు గాజులు సంతోషాన్ని, నారింజరంగు గాజులు విజయాన్ని, తెల్లరంగు గాజులు ప్రశాంతతను, నలుపురంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.


ఆధునికత ఉట్టి పడుతూ...
మారుతున్నకాలంతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలో పెనుమార్పులు వచ్చిన నేపధ్యంలో గాజు తన ప్రత్యే కతని నిలుపుకుంటూ నేటితరాన్ని ఆకర్షిస్తునే ఉందన టం లో సందేహంలేదు. కేవలం బంగారు, వెండిలతో తయారైనగాజుల మీదే కాకుండా లక్కతో పాటు ప్లాస్టిక్లతో, నైలాన్, దంతాలతో తయారైన గాజులపై యువత మక్కువ చూపిస్తోంది. నేటితరంలో గాజులకో ప్రత్యేక ప్రాధాన్యత దక్కు తోంది. కాలమెంత మారినా.మ్యాచింగ్ విషయంలో యువత ఏమాత్రం రాజీపడటం లేదన్న ది వాస్తవం.ఇక అనేక పూసలు, రంగు రంగుల రాళ్లుతో అనేక డిజైన్లతో గాజులు వచ్చేసాయి.
(మట్టి గాజులు, బంగారు గాజులే వేసుకోవాలి తప్ప ఇప్పుడు వస్తున్న ప్లాస్టిక్, కొన్ని మెటల్ గాజులు రసాయనాలతో చేయటం వలన ఆ కాలుష్యం మనశరీరంలోకి స్వేధగ్రంధుల ద్వార లోపలికి చేరి కొన్ని రకాలా వ్యాధులకు దోహదం చేస్తుంది.)

కాలమెంత మారినా ,నాగరికత ఎంత పెరిగినా ..వనితల మనసులు దోచే గాజులు మాత్రం.. రూపలెన్నో మారుతున్నాయి ,కానీ.. సింగారం లో వాటి స్థానం మాత్రం.. చెక్కుచెదరకుండా.చిరస్థాయి గా అలాగే ఉంది
క్రీ.పూ. 2300 - 1000 సంవత్సరాల నటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంచేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు , ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. ముంజేతి కడియాలను చాలా అరుదుగా ధరిస్తున్నారు. లతలు, మొసళ్లు, సింహాలు, ఏనుగులు,నెమళ్లవంటి ముఖాకృతిలో ఉండే ముంజేతి కడియాలు ఇష్టపడని మహిళ ఉంటుందా. ఈనాడు మట్టిగాజులు, లక్క గాజులు, ప్లాస్టిక్ గాజులు, రాళ్ల గాజులు , నవరత్నాల గాజులు అంటూ విభిన్నమైన , వినూత్నమైన గాజులు అందుబాటులో ఉండి అతివలను అలరిస్తున్నాయి.


భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన సరోజని నాయుడు గారు రాసిన ఈ కవిత గుర్తుచేసుకుందామా?


Bangle sellers are we who bear
Our shining loads to the temple fair...
Who will buy these delicate, bright
Rainbow-tinted circles of light?
Lustrous tokens of radiant lives,
For happy daughters and happy wives.
Some are meet for a maiden's wrist,
Silver and blue as the mountain mist,
Some are flushed like the buds that dream
On the tranquil brow of a woodland stream,
Some are aglow with the bloom that cleaves
To the limpid glory of new born leaves
Some are like fields of sunlit corn,
Meet for a bride on her bridal morn,
Some, like the flame of her marriage fire,
Or, rich with the hue of her heart's desire,
Tinkling, luminous, tender, and clear,
Like her bridal laughter and bridal tear.
Some are purple and gold flecked grey
For she who has journeyed through life midway,
Whose hands have cherished, whose love has blest,
And cradled fair sons on her faithful breast,
And serves her household in fruitful pride,
And worships the gods at her husband's side.


హిందూ సంస్కృతి
అతి పూరాతనమైన చేతికళల పరిశ్రమలలో చేతిగాజుల పరిశ్రమ ఇకటి. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు. చేతికి గాజులులేని స్త్రీలను వుహించలేము. స్త్రీలచేతులకు గాజులు వుండటం గౌరవ సూచకము.స్త్రీలు ఆభరణాలపై,పట్టుచేరెల పై ఎంత మక్కువ చూపెదరో, గాజులపై అంతే మక్కువ చూపిస్తారు. గాజులను మహిళలు ధరించడం సనాతన భారతీయ సంప్రదాయములో ఒకభాగము. ముతైదువకు వుండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటి. గాజుల తయారి,అమ్మకం పై ఆధారపడి నేటికి కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.ఎక్కడ తిరునాల, లేదా జాతర జరిగిన మనకు తప్పని సరిగా కన్పించేవి గాజులమ్మేదుఖాణాలు. గ్రామ ప్రాంతాలలోని వారపు సంతలలో కాడా గాజులమ్మేవారు కన్పిస్తారు. పూర్వకాలములో ప్రత్యేకముగా ఒక కులము (గాజుల బలిజ) వారు ఈ గాజులమ్మే వృత్తిలో వుండేవారు. గాజుల వుత్పత్తిదారులనుండి గాజులను టోకులో కొనుగోలున తెచ్చుకుని వూరూర తిరుగుచు, ఇంటింటికి తిరిగి గాజులమ్మేవారు. పూర్వకాలములో ఇంటిలో పెళ్ళి జరిగిన, శ్రీమంతము జరిగిన, లేదా ఏ శుభకార్యము జరిగిన గాజులోళ్ళను ఇంటికి పిలిపించుకుని, ఇంటిళ్ళిపాది ఆడవాళ్ళు గాజులు వేయించుకుని, వారికి నమస్కరించి, తగిన విధముగా సంభావన యిచ్చి పంపేవారు.ఏదైన కార్యము మీద బయటకు వెళ్ళునప్పుడు గాజులమ్మేవారు కాని, మట్టిగాజులు ధరించిన స్ర్తీ ఎదురుగా వచ్చిన శుభకరమని, వెళ్ళె కార్యాము జయప్రథముగా జరుగుతుందని భావిస్తారు. ఆధునీక కాలములో వచ్చిన పెను మార్పుల కారణముగా వూరూర తిరిగి గాజులమ్మే వారు కనుమరిగైపోయారు. కాని గాజుల వాడకం మారలేదు, తగ్గలేదు. అధునాతనంగా, పారిశ్రామికంగా దేశము మారినను, ఇప్పటికి గాజుల పరిశ్రమ హస్తకళ/చేతి వృత్తుల పరిశ్రమగా కొనసాగుతు, కొన్ని లక్షల మధ్య తరగతి కుటుంబ ఆడవారికి జీవనోపాది కల్పిస్తున్నది. వేదకాలం నాటి కన్న ముందే స్ర్తీలు గాజులు ధరించే వారని లభించిన ఆధారలను బట్టి తెలుస్తున్నది. మహోంజొదార త్రవ్వకాలలో లభించిన చిత్రాలలో చేతికి కంకణంధరించిన స్త్రీ చిత్రాలున్నాయి. యక్షిణి చిత్రాలలోని కూడా యక్షిణి చేతికి కంకణం ధరించినది. బాణబట్టు తన కావ్యములో సరస్వతిదేవి చేతికి గాజులు (కంగణ్‌) ధరించినట్లుగా పెర్కొన్నాడు.పురాతన తవ్వకాలలో తక్షశిల వద్ద, మౌర్య సామ్రాజ్యకాలం నాటి రాగి గాజులు లభించాయి. అజంతా చిత్రాలలోని, ఎల్లోరా శిల్పాలలోని స్త్రీలు గాజులు (కంగణ్‌) ధరించడం కన్పిస్తున్నది. B.C.230-100 నాటికే సిందులోయలో గాజులు ధరించెవారని తెలుస్తున్నది. జానపదపాటలలో,కావ్యాలలో,సాహిత్యములో గాజుల ప్రస్తవన విస్రుతముగా కన్పిస్తున్నది.సిక్కులు తమ మతాచారం లో లోహంతో చేసిన గాజును ధరించెదరు.దానిని 'కడ' (kada) అంటారు.చేతికి ధరించే ఈ కంకణములను ఎక్కువగా గాజు (Glass) తో చెయ్యడం వలన "గాజులు" అనే పేరు తెలుగులో రూడి అయ్యింది. గాజులనే కరకంకణములని కూడా అంటారు. గాజులను సంస్కృరములో 'కంకణ్‌' అనియు, హిందిలో 'చిడియ', 'చుడ' అని అంటారు. పంజాబులో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతము (ivory) తో చేసిన గాజులని ధరించదం సంప్రదాయం. ఉత్తర ప్రదేశ్‌లో పెళ్ళికూతురు ఏర్రచీర, ఏర్రగాజులు ధరించడం శుభదాయకంగా తలంచెదరు. మహరాస్ట్రలో, కర్నాటకలో, ఆంధ్రలో పెళ్ళికూతురు పచ్చగాజులు ధరించడం ఆనవాయితి. పచ్చరంగు శుభానికి పతీకగా భావిస్తారు.
అలాగే పూర్వకాలంలో రాజస్తాన్‌ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలము మణికట్తు నుంచి,ముంచెయ్యివరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు.అలాధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, మరియు సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము, విశ్వాసం.పశ్చిమ బెంగాల్‌లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా వున్నది. నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురు తో చేసిన గాజులు ధరించడం గమనించవచ్చును.స్త్రీ దేవరామూర్తులకు ఎర్రగాజులను భక్తులు కానుకగా,మూడుపులుగా సమర్పించెదరు. కలకత్తలో కాళి దేవతకు ఎర్రగాజులను భక్తులు సమర్పించుకుంటారు. మిగాతా ప్రాంతాలలో నల్లటి గాజులను సమర్పించుకుంటారు. దక్షిణ భారతదేశములో స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు, పుట్టింటి వారు 'శ్రీమంతము'లో ఒకచేతికి 21 గాజులు, మరోచేతికి 22 గాజులు తొడుగుతారు.గాజుతో చేసె గాజుల పరిశ్రమను మొగలుల కాలములో బాగా ప్రోత్యాయించారు. ముఖ్యముగా ఫెరొజాబాద్‌లో గాజుల పరిశ్రమ అబివృద్ది చెందుటకు కారణము మొగలు సుల్తాను లు యిచ్చిన ప్రోత్యాహమే కారణము.

No comments:

Post a Comment