Wednesday 16 September 2020

మహాలయ అమావాస్య


 

మన అస్థిత్వానికి కారకులు మన తల్లితండ్రులు, వారి పూర్వులు. వారిని స్మరించుకోవడం, వారిపట్ల గౌరవాన్ని చూపించడం మన కర్తవ్యం. ప్రతి మానవుడూ తీర్చుకోవాల్సిన ఋణాలు మూడు ఉంటాయని పెద్దలు చెబుతారు. అవి దేవతల ఋణం, ఋషుల ఋణం. మన పూర్వీకులైన పితరుల ఋణం. వీటిలో పితృ ఋణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలం పితృపక్షం. దీనినే ‘మహాలయ పక్షం’ అని కూడా ఉంటారు. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకూ… ఈ పదిహేను రోజుల కాలం పితృ తర్పణాలకూ, పిండ ప్రదానాలకూ విశిష్టమైనదని శాస్త్రవచనం.

భాద్రపదమాసంలోని బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని అంటారు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. పితృదేవతలకు శ్రాద్ధం జరిపితే వారికి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని ఐతిహ్యం. వైదికం, తిథి, శ్రాద్ధం పేరుతో జరిపే పితృకార్యం ఇంట్లో కంటే నదీతీరంలో, సముద్ర తీరంలో జరపడం ముక్తిదాయకమని ప్రతీతి. వైదికంగా జరిపేవారు పుణ్యక్షేత్రాల్లో మహాలయ పక్షాలను నిర్వహిస్తుంటారు. దసరా పండుగ ప్రారంభానికి ముందు వచ్చే 15 రోజులే మహాలయ పక్షాలు.

సహజమైన మరణం సంభవించిన వారికి, ప్రమాదాలు, ఆత్మహత్యల కారణంగా మరణించిన వారికి వైదికం జరిపే తీరులో భేదం ఉంటుంది. అసహజంగా, ఆత్మహత్య కారణంగా విగతజీవులైన వారికి మహాలయ పక్షంలో శ్రాద్ధం జరుపుతారు. తండ్రి, తాత, తండ్రి తండ్రి (ముత్తాత) లకు పితృ, పితామహ, ప్రపితామహ పేర్లతో వైదిక జరపగా ఆ పై వాళ్లకు అంటె అంతకు ముందు తరాలవారికి తిథులు ఉండవు. దీనితో వారిని స్మరిస్తూ కర్తలు పితృపక్షంలో ఒకరోజున వైదికం నిర్వహిస్తారు. తిథి సందర్భంగా కనీసం ఇద్దరు బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనం పెట్టి దక్షిణ చెల్లిస్తారు. హిరణ్యం (బంగారం) బదులు కొంత పైకాన్ని దక్షిణగా ఇస్తారు. వైదికంలో తర్పణ విధి ప్రధానమైనది. దీనికై కర్త మంత్రం చెబుతూ పితృదేవతలకు నల్ల నువ్వులు, నీరు అర్ఘ్యంగా వదులుతాడు.

మహాలయ అమావాస్య
మహలయ అమావాస్యను కొన్ని ప్రాంతాలలో సర్వ పితృ అమావాస్యగా జరుపుతారు. 2020, సెప్టెంబర్ 17 న మహాలయ అమావాస్య రానున్నది. మహాలయ  పక్షం రోజుల్లో పెద్దలకు తర్పణలు ఇవ్వటం కుదరని వారు అమావాస్య రోజు గతించిన పెద్దలకు తర్పణాలు విడిచి యధాశక్తి అన్నదానం వంటివి నిర్వహిస్తారు. మరి మహాలయ పక్షం ప్రత్యేకత ఏమిటి? పితృ ఋణం ఎందుకు తీర్చుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కర్ణుడి కథలో దొరుకుతుంది.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం… ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది కర్ణుడికి.

ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.  2020 సంవత్సరంలో మహాలయ అమావాస్య సెప్టెంబరు 17 గురువారం నాడు వచ్చింది. 

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment