Thursday 25 August 2016

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ? 

 

కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.

ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి  జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి  శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

  •     గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏంటంటే.. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. అంటే స్కలనం అనేది ఎరుగడు. నెమలి పరవశించినపుడు మగనెమలి అశ్రు ధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తల  పై నెమలీక ధరిస్తాడు. మరో ముఖ్య విషయం. పిల్లన గోవిని గోవిందుని పెదవుల వద్ద స్థానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడట. అప్పుడు పిల్లనగ్రోవి ఇలా చెప్పిందట. ఇలా చూడు నాలో ఏముందని అడిగిందట. నాలో ఏమీ లేదు. ఏ కల్మషమూలేదు. ఏ కోరికలూ లేవు.. ఈ కామ, క్రోధ,లాభ, మోహ , మధ, మాత్సర్యాధి హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది. తనదంటూ ఏదీ కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందట పిల్లనగ్రోవి.
   
 మనవి : పైన ఇచ్చిన జవాబు  పురాణ పురుషుల ఊహాగానాలే . ప్రతీ జీవి లోనూ సంపర్కము వలనే పురరుత్పత్తి జరుగుతుంది. అది ప్రకృతి సహజము .పురుష బీజకణాలు , స్త్రీ బీజ కణాలు కలయిక వలనే పిండోత్పత్తి జరుగుతుంది. పురుష ఇంద్రియం నోటిద్వారా త్రాగడము ద్వారా పిండోత్పత్తి ఏజీవిలోనూ జరుగదు. జీవపరిణామ క్రమమములో క్లోయకా ద్వారా నెమళి లో గర్భోత్పత్తి జరుగుతుంది.

 

No comments:

Post a Comment