Friday 12 August 2016

ఆలయాలలో ప్రదక్షణలు ఏవిధంగా చేయలి?

ఆలయాలలో ప్రదక్షణలు ఏవిధంగా చేయలి?

మనకి మాములుగా ప్రదక్షణలు  తెలుసు కానీ గుడి లొ కుడి నుండి ఎడముకు ,ఎడమ నుండి కుడి కి చేస్టారు .ఎందుకు చేస్టారు ,ఎలా చేస్టే మంచిది .
మన ఆలయాలు రెండు రకాలు ధ్వజస్తంభం కలిగిఉన్నవి . ధ్వజస్తంభం లేనీవీ .ఇవి ఆగమ శాస్త్రానుసారం గా నిర్మించబడినవి .వీటీనీ దేవాలయాలు అనీ ,దేవస్థానములు అనీ వ్యవహరిస్తారు .ఆగమ శాస్త్రంతో నిమిత్తం లేకుండ కేవలం వాస్తు చూచీ నిర్మించేవీ మందిరాలు ,ప్రదక్షణలు అక్కడ ఇక్కడ కూడా చేస్తారు ..ధ్వజస్తంభం ఉన్న ఆలయాలకి ధ్వజస్తంభం నుండి ప్రారంభించి ధ్వజస్తంభం వరుకు చేస్టే ఒక ప్రదక్షణ పుర్తిఅవుతుంది .మందిరం అయతే ముఖద్వారం నుండి ముఖద్వారం వరుకు,సామాన్యంగా ఆనీ ఆలయాలకు ,మందిరాలకు మూడు ప్రదక్షణలు చేస్తారు .అంజనేయ స్వామి కీ ఐదు ప్రదక్షణలు చేయలి.ఎందుకంటి హనుమాన్ పంచ సంఖ్యాయ అనీ చేప్పినందువలన ,హనుమంతుడు కీ ఐదు సంఖ్య అంటే చాల ప్రేతి
ఒక్క ముఖ్యమైన కోరిక తో చేసేటప్పుడు 108,54,27,11, ఇలా నియమిత సంఖ్య తో చేస్తారు .ఇక శివాలయం లొ ప్రతేఖంగా చేసేప్రదక్షణలు చండీ ప్రదక్షణలు అంటారు .
దీనీ విధానం ప్రత్యేకంగా ఉంటుంది .ధ్వజస్తంభం నుండి ప్రారంభించి దక్షిణం గా ఆలయం వెనుక గా సోమసూత్రం వరుకు చేసీ మరల వెనుక గా ధ్వజస్తంభం వరుకు వచ్చి మళ్ళి ప్రదక్షణ క్రమం లొ ఆలయం చుట్టు తిరిగి ధ్వజస్తంభం వరుకు ప్రదక్షణ చేస్తే అదీ చండీ ప్రదక్షణ అంటారు ఇది చాల విశేషం కలిగిస్తుంది అనీ అంటారు.

No comments:

Post a Comment