Sunday 21 August 2016

మహా మృత్యుంజయ మంత్రం‬ యొక్క ‪ప్రాముఖ్యత‬

మహా మృత్యుంజయ మంత్రం‬ యొక్క ప్రాముఖ్యత‬

అనుక్షణం రక్షిస్తూ ఉండేదిగా 'మహా మృత్యుంజయ మంత్రం' చెప్పబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం అసమానమైనదిజీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకువస్తుందో ఊహించలేం. అలాగే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు ఈ శరీరంపై దాడిచేస్తుందో తెలియదు. ఆ వ్యాధి జీవుడిని ఈ లోకం నుంచి వెంటనే తీసుకువెళుతుందో, లేదంటే జీవించినంత కాలం బాధపెడుతుందో కూడా తెలియదు.
ఇలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోనవ్వడం జరుగుతూ వుంటుంది. అయితే ఎలాంటి దుర్ఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదిగా 'మహా మృత్యుంజయ మంత్రం' చెప్పబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం అసమానమైనది. ఈ మంత్ర ప్రభావం దుర్ఘటనలకు దూరంగా ఉండేలా చేస్తూ సదా రక్షిస్తూ వుంటుంది. మరి అంతట మహిమాన్నిత్వాలున్న మహా మృత్యుంజయ మంత్రం గురించి, పఠించడం వల్ల పొందే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి:
మహా మృత్యుంజయ మంత్రంను మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రంను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు.

మహా మృత్యుంజయ మంత్రం  శివునికి అంకితం:
మహా మృత్యుంజయ మంత్రం లార్డ్ శివునికి అంకితం చేయబడింది. ఋషి మార్కండేయ ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడెను.

మార్కండేయ మంత్రం అనే పేరు:
ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.

మహా_మృత్యుంజయ_మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

మంత్రం యొక్క అర్ధం:
అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంద భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా అని అర్ధం.
మహా మృత్యుంజయ మంత్రం శివుని యొక్క రెండు అంశాలను వివరిస్తుంది.
ఒక అంశం ఏమిటంటే మండే మూడు కనులతో ఉన్న దేవుడుని చూపిస్తుంది.
రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని
ఇంకా రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి, యముడు మానవుల మరణం తీసుకుని మరియు ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి భాద్యతను తీసుకొనెను.
భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను.
ఈ కారణంగా మానవులకు భూమి మీద మరణం గురించి బాధ ఎక్కువైనది. అన్ని రకాల భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను. ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది.

మంత్ర జపం ఎలా చేయాలి?
మంత్రం జపించటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి.
ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు :
ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత:
మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది మనస్సు మరియు శరీరంనకు ఒక స్వస్థత బలంగా పనిచేస్తుంది. మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు.
ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రామాణికమయిన మంత్రం.
ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. గాయత్రి మంత్రం వలె మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది. క్షీర సాగన మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.
 ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఈ మంత్రం ఒక విధమైన మృత సంజీవని అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆపదలు కలిగినపుడు కూడా చదువుకోవచ్చు. సాధారణంగా మూడుసార్లు కానీ, తొమ్మిది సార్లు గానీ బేసి సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు

No comments:

Post a Comment