(కలియుగం 5,124 సం॥ల క్రితం మొదలైంది.)
కలియుగం…. మొదటి పదివేల సంవత్సరాలను ‘యుగసంధి’ లేదా ‘స్వర్ణయుగం’ అంటారు!
అంటే దానర్ధం?! ఈ సమయం, పూర్తి-కలియుగంగా మారడానికి పట్టే సమయం అని చెప్పొచ్చు!
ఈ మొదటి పదివేల సంవత్సరాలు మాత్రమే, లోకంలో ధర్మం భక్తి లాంటివి ఇంకా మిగిలి ఉంటాయి!
ఆ తరువాత వచ్చేది ఘోరకలి! (మహాఘోరంగా ఉంటుంది)
ఎవరయితే నిత్యం భక్తితో భగవంతుడి పాదాలు పట్టుకుంటారో…. వారు మాత్రమే, మళ్ళీ ఈ కలియుగంలో తిరిగి పుట్టకుండా రక్షించబడతారు! (ముక్కలో-పూర్తి సారాంశం ఇదే)
ఈ కలియుగ లక్షణం ప్రకారం, ఎక్కువ శాతం ప్రజలు క్రోధంతో, కోరికలతో, వ్యగ్రతతో తిరిగేవారు అయ్యుంటారు కాబట్టి వారి దృష్టి భగవంతుడి మీదకు లగ్నం కాకుండా ఉండి, చివరికి అధికశాతం ప్రజలు అధోగతులపాలు అవుతారు.
ఇంకా, పరమ దుర్మార్గంగా ప్రవర్తించేవారు అయితే కల్పాంతం వరకూ కూడా శూన్యంలో (స్పేస్ లో) పిశాచంలా తిరుగుతూ ఉంటారు.
కలియుగంలో రక్షించబడాలి అంటే చిత్తశుద్ధితో, భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించడం ఒక్కటే శరణ్యం!
భగవంతుడికి తరతమ బేధం అస్సలు ఉండదు!
ఎవరి అర్హతకి తగిన ఫలం వాళ్లకు అనుగ్రహిస్తాడు!
ఎవరి గుణాలకి తగ్గ ఫలం వాళ్లకు దక్కుతుంది అంతే!
భగవంతుడి నామం మనలను సదా రక్షిస్తుంది, కానీ చేసిన కర్మలు అయితే అంత సులువుగా వదిలి పెట్టవుగదా !
ఇక ఈ కలియుగంలో మనం చెయ్యగలిగిందల్లా,
బుద్దిని సాధన ద్వారా మార్చే ప్రయత్నం చేయడం!
భక్తితో ఈశ్వరుని పాదాలు పట్టుకోనే ప్రయత్నం చేయడం మాత్రమే!
చిత్తశుద్ధితో ఫలాపేక్ష లేని భక్తి మాత్రమే మనలను రక్షిస్తుంది.
🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment