Tuesday 13 April 2021

ఈరోజు నుండి రామాయణ పారాయణ: వాల్మీకి రామాయణం

 


* ప్రార్థన *
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే
త్సర్వ విఘ్నోపశాంతయే॥
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానా
మేకదంతం ముపాస్మహే॥
*శ్రీ సీతారామ స్తోత్రం*
అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయకమ్।
రాఘవాణామలంకారం వైదేహనామలంక్రియామ్॥ ౧
రఘణాం కులదీపం చ నిమీనాం కులదీపికామ్।
సూర్య వంశసముద్బూతం సోమవంశసముద్బవమ్॥ ౨
పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః।
వశిష్ఠానుమతాచారం శతానందమతానుగామ్॥౩
కౌశల్యాగర్భసంభూతం వేదిగర్బోదితాం స్వయం।
పుండరీకవిశాలాక్షం స్పురదిందీవరేక్షణామ్॥ ౪
చంద్రకాంతాననాంభోజం చంద్రబింబోపమానామ్।
మత్తమాతం గగమనం మత్తహంసవధూగతామ్॥ ౫
చందనార్ధ్రభుజామధ్యం కుంకుమార్ధ్రకుచలీస్థలీమ్।
చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికామ్॥ ౬
శరణాగతగోప్తారం ప్రణిపాదప్రసాదికామ్।
కాలమేఘనిభం రామంకార్తస్వరసమప్రభామ్॥ ౭
దివ్యసింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్రభూషణమ్।
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణకాంక్షిణౌ ॥ ౮
అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహమ్పతీ।
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్ధతామ్॥ ౯
అనేన స్తౌతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః।
తస్య తౌ తనుతాం పుణ్యాః సంపదః సకలార్ధదాః॥ ౧౦
ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః।
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదమ్।
యః పఠేత్ప్రతరుత్దాయ సర్వాన్ కామానవాప్నుయాత్॥ ౧౧
*ఇతి హనుమత్కృత సీతారామ స్తోత్రం సంపూర్ణం*




*ముందు మాట*


చైత్ర మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం లలో   రామాయణ పారాయణ చెయ్యడం ఎ ఎంతో శుభదాయకం. ఉగాదినుండి శ్రీ రామనవమి వరకు తొమ్మిది రోజులు శ్రీ రామాయణ పారాయణ మరింత పున్యదాయకం .ఈరోజునుంది తొమ్మిది రోజులు వరుసగా రామాయణ సర్గలు పోస్ట్  చేస్తాను అందరు భక్తితో చదవండి. మీ మనోభీష్ట సిద్ది తో పాటు ఈ గడ్డు కాలంలో  రోగ, రుణ  బాధలనుండి ఉపశమనం పొందండి. 


తెలుగు మరియు సంస్కృతంలో ఇవ్వడం జరుగుతుంది ఎవరి వీలుబట్టి వారు ఏదైనా ఒక భాషలో కాని రెండు భాషలలో కాని చదవవచ్చు.

శ్రీరామాయణమునందు మర్యాదా పురుషోత్తముడు అయిన శ్రీరాముని యొక్క దివ్య గాథ వర్ణించబడింది. ఆదికవి వాల్మీకి ప్రణీతమైన రామాయణానికి మాత్రమే "ఆదికావ్యం"గా ప్రపంచంలోనే ఎనలేని గౌరవం లభించింది. అద్భుత ఆదర్శ సమాహారం లాగా ఆనందింప జేస్తూ కర్తవ్యాలని కాంతాసమ్మితంగా ఉపదేశించడం ఈ మహా కావ్యం యొక్క విశేషం! మిత్రుడిలా హితబోధ గావించే రచనా కౌశలం, కావ్య వస్తు గౌరవం వంటి వాటిని బట్టి శ్రీరామాయణం ఓ అపురూప మహాకావ్యంగా విలసిల్లుతూ ప్రపంచమందలి సమస్త కావ్యాలకీ మకుటాయమానమై నిలిచింది.
వాల్మీకి రామాయణం సర్వోత్కృష్ట మైన ఒక మహా కావ్యం. శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క అవతార విశేషాలని తెలిపే బహు చక్కని ఇతిహాసం అనే విషయం విస్మరింపరానిది. స్వయంభువు అయిన బ్రహ్మ దేవుడు వాల్మీకి మహామునికి సాక్షాత్కరించి రామాయణాన్ని రచించడానికి ఆ మునిని ప్రోత్సహించాడు. శ్రీరాముని వృత్తాంతానికి సంబంధించిన విశేషాలు సమస్తం నీకు సహజసిద్ధంగానే కరతలామలకం అవుతాయి అని వరాన్ని ప్రసాదించాడు.ఆ వరం యొక్క ప్రభావం ఫలితంగా కథా విషయాలన్నీ ఆ మునీశ్వరుడికి అత్యంత స్పష్టంగా గోచరించాయి. కావ్య నాయకుడు అయిన శ్రీరామచంద్ర మూర్తి అవతార కాలము నందే వాటిని ఆ మహర్షి శ్లోక బద్ధమొనరించడం ఓ దివ్య ఘటన. వాటిని లవకుశులచే కంఠస్థం చేయించి రాబోయే ఘటనలతో సహా ఆ వృత్తాంతాలని శ్రీరాముని సమక్షంలోనే నిండు సభలో వినిపింపజేశాడు ఆ మహర్షి. ఈ విధంగా రాముని ఆమోద ముద్ర లభించిన ఈ మహా కావ్యంలో అసత్యములు గాని, దోషములు గాని, అతిశయోక్తులు గాని ఉంటాయేమోనని ఊహించడానికి ఏ మాత్రం వీలు లేదు. ఇది సకల జనులకు ఆదరణ యోగ్యమై, ప్రయోజనకరముగా మారింది. ఈ కావ్యమును ప్రచారం చేయడం వలన అనంతమైన లోక కళ్యాణము సిద్ధిస్తుంది. ప్రతి వ్యక్తీ దీనిని శ్రద్ధగా పఠించి అవగాహన చేసుకొని, ఇందలి ఉత్తమోత్తమైన ఉపదేశములను యధాశక్తి తో ఆచరించినచో అతని జీవితము ఆదర్శ ప్రాయమై సఫలమవుతుంది.

May be an image of 1 person



చైత్ర మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం లలో   రామాయణ పారాయణ చెయ్యడం ఎ ఎంతో శుభదాయకం. ఉగాదినుండి శ్రీ రామనవమి వరకు తొమ్మిది రోజులు శ్రీ రామాయణ పారాయణ మరింత పున్యదాయకం .ఈరోజునుంది తొమ్మిది రోజులు వరుసగా రామాయణ సర్గలు పోస్ట్  చేస్తాను అందరు భక్తితో చదవండి. మీ మనోభీష్ట సిద్ది తో పాటు ఈ గడ్డు కాలంలో  రోగ, రుణ  బాధలనుండి ఉపశమనం పొందండి. 


తెలుగు మరియు సంస్కృతంలో ఇవ్వడం జరుగుతుంది ఎవరి వీలుబట్టి వారు ఏదైనా ఒక భాషలో కాని రెండు భాషలలో కాని చదవవచ్చు.


రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియాథాయిలాండ్కంబోడియామలేషియావియత్నాంలావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము

రామాయణము ప్రాముఖ్యం


24,000 శ్లోకాలతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇతర భారతీయ భాషలలో తులసీదాసు రామచరిత మానసము (కడీ బోలీ), కంబ రామాయణము (తమిళం), రంగనాధరామాయణము, రామాయణ కల్పవృక్షము, మందరము (తెలుగు) వంటి అనేక కావ్యాలు ప్రాచుర్యము పొందాయి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు. 


కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు)అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది."రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'ర' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే

వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కథ

మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త.

ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు.

కఃను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కః చ వీర్యవాన్

ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యో దృఢ వ్రతః

ఈ కాలం లో, ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవడయిన ఉన్నడా..? ఉంటే వాని గురించి చెప్పు అని అడుగుతాడు.

అవియే కాక అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు... అలా 16 గుణములు చెప్పి అవన్ని ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా అని వాల్మికి మహర్షి అడుగుతాడు.

అప్పుడు నారదుడు ఇట్లా చెబుతాడు.

మహర్షీ, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేల..!

కానీ అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెపుతాను అని ఈ విధముగా చెప్పనారంభించెను.

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః

నియతాత్మా మహావీర్యో ధ్యుతిమాన్ ధృతిమాన్ వశీ.

ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన అపారమైన శక్తి కలవాడు, సంకల్పశక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించ గల్గిన వాడు, ఈ ప్రపంచాన్ని అంతటిని పొషించగల్గిన వాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువయా అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభిచెను.

సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మికి మహర్షికి చెప్పెను. అప్పుడు వాల్మికి మహర్షి అమితానందభరుతుడయ్యెను. పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి వుంటుందో అలా ఆయన హృదయమంత రామాయణం నిండిపోయెను.

ఆ మరునాడు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.

మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్

"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి"

శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని, అది రామాయణం వినుటవలన తటస్థించెనని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మ దేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపుమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.

యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్

తెలుగులో

మధ్యయుగంలో సంస్కృత రామాయణమును చాలా మంది తెలుగు కవులు తెలుగులోకి అనువదించారు. వారిలో మొల్ల కవయిత్రి (మొల్ల రామాయణము ), కంకంటి పాపరాజు (ఉత్తర రామ చరితము), గోన బుధ్ధా రెడ్డి (రంగనాథ రామాయణము), విశ్వనాధ సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షము), వావిలికొలను సుబ్బారావు లేదా వాసుదాస స్వామి (అంధ్ర వాల్మీకి రామాయణము), ఉషశ్రీ ప్రసిధ్ధులు. ఐతే లెక్కకు మిక్కిలి ఇతర అనువాదములు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. ఇక రామాయణముతో సంబంధము గల రచనలు, కీర్తనలు, పాటలు, సినిమాలు, కథలు, పేర్లు, ఊర్లు - చెప్పనవసరం లేదు.అవి అసంఖ్యాకంగా ఉన్నాయి.

తెలుగులో ఎందరో మహానుభావులు 'రామ'నామమును స్మరించి, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులను, వాల్మీకిని స్తుతించి ప్రసిద్ధులైనారు. వారిలో ప్రధానముగా పోతన, మొల్ల, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, వాసుదాసస్వామి లను పేర్కొనవచ్చును.


కావ్య విభాగములు, సంక్షిప్త కథ

రామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు).ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.

  • బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
  • అయోధ్య కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
  • అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
  • కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
  • సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
  • యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
  • ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371









No comments:

Post a Comment