Wednesday 14 April 2021

మత్స్య జయంతి



   💠 మత్స్య జయంతి ప్రత్యేకత ఏంటి 💠
  
ప్రపంచంలోని అతి పురాతనమైన మతాలలో హిందూ మతం కూడా ఒక్కటి. కానీ అనేక మతాలలో ఉన్నట్లు గా కేవలం ఒక్క దేవునికే పరిమితం కాలేదు హిందూ మతం. హిందూ మతంలో 33 మిలియన్ దేవతలు ఉన్నారు. సూచన ప్రాయంగా ముక్కోటి దేవతలుగా అభివర్ణిస్తుంటారు. ప్రతి ఒక్క దేవునికి వారికి తగ్గ ప్రత్యేకతలు మరియు కథలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి.

హిందువుల విశ్వాసం ప్రకారం సృష్టి ఏర్పడడానికి కూడా ఒక కారణం ఉంది. మరియు ప్రతి చెడుకి ఒక మంచి రక్షగా ఉంటుంది. కానీ సృష్టి కారణం పూర్తయ్యాక, నాశనం గావించబడుతుంది.

జీవన్మరణాల సమర్ధ నియంత్రణకై సృష్టి ఆవిర్భావం జరిగింది, దీని యొక్క భాద్యత సృష్టికర్త బ్రహ్మపై ఉన్నది. జీవుల కర్తలను కర్మలను నిర్ణయించి, వారి కర్మలు పూర్తయిన తర్వాత మరణం ద్వారా సమగ్ర నియంత్రణ జరిగేలా బ్రహ్మ చూస్తాడు.


                💠 మత్స్య జయంతి విశిష్టత 💠



విష్ణువు సృష్టి రక్షకునిగా కీర్తింపబడుతాడు. ఎప్పుడైనా, సృష్టియందు చెడు పెరిగి మంచికి ఆపద వస్తున్న సమయాన, తన అవతారాలతో చెడుని తుదముట్టించి సృష్టిని కాపాడే భాద్యత అంతిమంగా విష్ణు దేవునిది అవుతుంది. అదే సమయంలో కార్యాలన్నీ పూర్తి చేసుకున్న సృష్టిని వినాశనం భాద్యత మాత్రం మహేశ్వరునిపై ఉంటుంది.

ఈ విధంగా, ఆధ్యాత్మిక దృష్టికోణంలో, విష్ణువు యొక్క తొమ్మిది అవతారాలు రామావతారం, కృష్ణావతారం, కూర్మావతారం , నరసింహావతారం, వరాహావతారం, వామనావతారo , నరసింహావతారం, భార్గవ అవతారం అలాగే మత్స్యావతారం హిందూమతంలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇతర అవతారాలలో, మత్స్యావతారం ప్రముఖమైనది. ఈ మత్స్యావతారానికి గుర్తుగా మత్స్య జయంతిని హిందువులు జరుపుకుంటారు. ఈ సంవత్సరo మత్స్యజయంతి మార్చి 20 న వస్తుంది అనగా ఈరోజు.

ఈ ప్రత్యేకమైన పండుగ గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

  💠 మత్స్య జయంతి ఎప్పుడు జరుపుకుంటారు 💠

ఈ సంవత్సరం, మత్స్య జయంతి మార్చి 20 న వస్తుంది అనగా ఈరోజు. ఇది భారతదేశం యొక్క సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం శుక్ల పక్షాన మూడవ రోజు జరుపుకుంటారు. ఈ రోజున, విష్ణు భగవానుడు వేదాలను రక్షించడానికి ఒక కొమ్ముల చేప వలె కనిపించాడు. రాబోయే శతాబ్దాల్లో భూమిని ఎదుర్కోబోయే గొప్ప మహా ప్రళయాల గురించి హెచ్చరించడానికి విష్ణువు ఈ ప్రత్యేక అవతారం లో భూమిపై కనిపించినట్లు, తద్వారా సమర్ధుడైన మనువుకి ఈ భాద్యతను అప్పగించినట్లుగా కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి.


           💠 మత్స్య జయంతి మూల కథ 💠


ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములు  ప్రసిద్ధమైనది. మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.

బ్రహ్మకు ఒక పగలు అంటే - వెయ్యి మహాయుగాలు ....  గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగ చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని 'కల్పం' అని అంటారు.

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది "రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు" అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు ... ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం "తాను శ్రీమన్నారాయణుడుని  అని, ఏడు రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని" పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.

మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి, ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి, 'వైవస్వత మనువు' గ ప్రశిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు  నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా, "సొమకాసురుడు" అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి, సముద్రగర్భంలోకి  వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా, అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి,, అతని కడుపుని చీల్చి ......  వేదాలను - దక్షిణావృత శంఖాన్ని తీసుకొని, బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని, శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

వేదాలను అపహరించటం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేసుకోవటం అని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృస్టికార్య  ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందటమే వేదాలు మరల గ్రహించటం అని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.

మత్స్య జయంతి  చైత్ర బహుళ తదియ నాడు జరుగుతుంది.      



         💠 మత్స్య జయంతి విధివిధానాలు 💠

ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు, కావున ఆలయంలో ప్రార్ధనలను చేయడం, ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే, అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం, హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ, ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.:

      💠 మత్స్య జయంతి యొక్క ప్రాముఖ్యత 💠

ఈ రోజు మత్స్యo తో అనుబంధం ఉన్న కారణాన, చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా అదృష్టం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. చేపలు మరియు ఇతర జల జంతువులకు ఆహారమివ్వడం కూడా సాధారణoగా దీక్షలో భాగంగానే ఉంటాయి. ఈ రోజున దాతృత్వంలోని ఏదైనా రూపం ప్రోత్సహించబడుతుంది. అందువల్ల చాలామంది ప్రజలు ఈ రోజున సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆహారాన్ని మరియు పాత దుస్తులు విరాళంగా ఇస్తుంటారు. ఈరోజు మత్స్య్తావతారo లేదా మత్స్య పురాణం సంబంధించిన కథలు చదవడం కానీ వినడం వలన కానీ పాప చింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు.

  💠 సంబంధిత కథలు మరియు వాటి నమ్మకాలు 💠




మనలో చాలామందికి తెలిసిన కథ ప్రకారం సత్యవ్రతుడు, మనువు మత్స్యాన్ని రక్షించిన వారిలో ఉన్నారు. దీనికి ప్రతిఫలంగా మత్స్యదైవం , మనువుకు ప్రళయాన్ని గురించిన హెచ్చరికలను ముందుగానే తెలియజేస్తుంది. ఈ ప్రళయం కారణంగా సమస్త సృష్టి వినాశనానికి గురవ్వబోతున్నదని, వేదాలను కాపాడవలసిన భాద్యతలను మనువు తీసుకోవలసినది గా దేవ మత్స్యం సూచిస్తుంది. మరియు అన్నీ మొక్కలకు సంబంధించిన విత్తనాలను, ఆరోగ్యకరమైన జంటలను కూడా కాపాడవలసినదిగా మనువు ఆదేశింపబడుతాడు. ఈ హెచ్చరికల కారణంగానే ఒక భయానకమైన ప్రళయం నుండి మనువు అనేకమందిని కాపాడగలిగాడు. తద్వారా మానవాళి ఉనికి ప్రశ్నార్ధకం కాకుండా చేయగలిగాడని పురాణాల సారాంశం.

                       💠 మత్స్య పురాణం 💠





మత్స్యావతారం గురించి మనకు తెలిసిన అనేక కథలు , చాలా భాగం మత్స్య పురాణం నుండే వచ్చినవి. ఈ పురాణాల్లో విష్ణువు , శివుడు మరియు శక్తి దేవతకు సంబంధించిన కథలు అనేకం ఉన్నాయి. ఇక్కడ అనేక అధ్యాయాలు హిందూమతంతో అనుబంధించబడిన పండగలు మరియు ఆచారాలకు అంకితమివ్వబడ్డాయి. ఈ పురాణం సమాజంలోని వివిధ విభాగాల (రాజులు మరియు మంత్రుల నుండి కేవలం పౌరులకు మాత్రమే) విధుల గురించి మాట్లాడుతుంది. హిందూ మతం యొక్క 18 అత్యంత ముఖ్యమైన పురాణాలలో ఒకటిగా ఈ మత్స్య పురాణం ఉండటం వలన, ఈ గ్రంథం భవననిర్మాణాలు, వేడుకలు మరియు అదే నిర్మాణాలతో అనుబంధించబడిన వేర్వేరు నిర్మాణ ఆకృతులను వివరించడానికి ఉపయోగపడుతుంది కూడా.

                💠 మత్స్య దేవాలయం 💠





ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఆలయ పట్టణ సమీపంలో, ప్రసిద్ధమైన మరియు విష్ణువు మత్స్యావతారానికి అంకితమిచ్చిన శ్రీ వేద నారాయణస్వామి ఆలయం ఉన్నది. ముందు చెప్పినట్లుగా, మత్స్య పురాణాల్లో వివరించబడిన నిర్మాణ వివరాలు చాలా ఖచ్చితమైనవి. ఈ ఆలయ రూపకల్పన మరియు సృష్టిలో ఇదే వాడబడింది. ప్రతి సంవత్సరం, సూర్యుడి కిరణాలు నేరుగా మార్చి 25 , 26 మరియు 27 వ తేదీల్లో విగ్రహం మీద పడేలా ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ సంవత్సరం మాత్స్య జయంతి మార్చి 20 వ తేదీన జరగనున్నదని పరిశీలిస్తే, రాబోయే పది రోజులు అత్యధిక జనసందోహంతో ఉండగలదని చెప్పకనే చెప్పవచ్చు. దీనికి కారణం గర్భగుడిలో విగ్రహం పై సూర్య కిరణాల తాకిడి. ఈ సమయంలో వేద నారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు కనులారవిందం చేయనున్నాడు. మిల్



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371







No comments:

Post a Comment