Wednesday 31 January 2018

గ్రహణం - జాగ్రత్తలు


సూర్యగ్రహణానికి 12 గంటల ముందు నుంచి, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుంచి ఆహారం తినకూడదు. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలివారు, రోగులకు సడలింపు. వారు మాత్రం గంట ముందు నుంచి ఆహారం తినడం నిషిద్ధం.
త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి.. తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణసమయానికి ఆహారం అరిగిపోవాలి/ జీర్ణమవ్వాలి, కడపు ఖాళీగా ఉండాలి.
1980-83 మధ్య కాలంలో భారతదేశంలో గ్రహణసమయంలో పాటించే ఆచారాల మీద పరిశోధన చేశారు విదేశీయులు. ఆ తర్వాత ఆ ఫలితాలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వారి పరిశోధనలో తేలిందేమిటంటే హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవి, ఆరోగ్యప్రదమైనవి. 
గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత కిరణాలు మానవులకు చేటు చేస్తాయి. ఆహారపదార్ధాలను విషతుల్యం చేస్తాయి. అటువంటి ఆహారపదార్ధాలను స్వీకరించడం వలన దీర్ఘకాలంలో దుష్ఫలితాలుంటాయి. గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే ధర్భ ఎంతో శక్తివంతమైనది. అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది. సూర్యశక్తిని అధికశాతం గ్రహిస్తుంది. గ్రహణ సమయంలో ఈ దర్భలను ఆహారపదార్ధాల మీద, నీటి బిందెలమీద వేయడం వలన గ్రహణ కిరణాల దుష్ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఒక రాగితీగ ఇంటిని పిడుగుపాటు నుంచి రక్షించిన చంధంగా దర్భ అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని వారి పరిశోధనలో తేలింది. వారు కొత్తగా చెప్పిందేమీ లేదు. ధర్మశాస్త్రం చెప్పిందన్నే ధృవపరిచారు.
ఇంట్లో ఉన్న పచ్చళ్ళ మీద, ఇతర ఆహార పదార్ధాల మీద దర్భలు వేయండి. అన్నం, కూర, పప్పు మొదలైన ఆహార పదార్ధాలు ఏవీ మిగల్చకూడదు. గ్రహణసమయంలో ఆహారం స్వీకరించకూడదు. జైపూర్ లో జంతు ప్రదర్శనశాలలో జంతువులకు గ్రహణ సమయంలో మాంసం పెట్టి పరీక్షలు నిర్వహించారు. గ్రహణసమయంలో కౄరజంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు. (ఈ విషయాన్ని తొలి తెలుగు మహిళా జ్యోతిష్యురాళు, శ్రీమతి సంధ్యాలక్ష్మీగారు గోపురం కార్యక్రమంలో ప్రస్తావించారు.)గ్రహణం కారణం భూమ్మీద ఉన్న జీవరాశి మైలపడుతుందని శాస్త్రవచనం.  
గ్రహణం తర్వాత తలస్నానం తప్పక చేయాలి.
గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు గర్భస్థ శిశువుకు మంచివికావు. అందువల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణసమయంలో బయటకు రాకపోవడం మంచిది. కదలకుండా పడుకోవాలి, అటు ఇటు తిరగకూడదన్న నియమాలేమీ లేవు. ఏ విధంగా కూడా గ్రహణకిరణాలు సోకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఒకవేళ బయటకు వెళ్ళవలసివస్తే తెల్లని వస్త్రం శరీరమంతా కప్పుకుని, గ్రహణకిరణాలు శరీరం మీద పడకుండా ఉండేలా చూసుకోవాలి.

ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది.  గ్రహణం పట్టగానే స్నానం చేసి దీపారాధన చేసి జపం చేసుకుంటే విశేష ఫలితాన్నిస్తుంది.  ముఖ్యంగా నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ.

గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు కదా,  మరి జపం చెయ్యమంటున్నారు,      అసలు దేవాలయాల్ని ఎందుకు మూస్తారు అనే సంశయంకలగవచ్చు.  ఆగమ  శాస్త్రానుసారం గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత ప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి.  అందుకే దేవాలయాలు మూసివేస్తారు.

జపం చేసుకోమన్నారుకదాని ఇళ్ళల్లోకూడా దేవతా విగ్రహాలను, పటాలను తాకి పూలు పెట్టి పూజ చెయ్యకూడదు.  కేవలం మానసిక జపం మాత్రమే చెయ్యాలి.  గ్రహణం సమయంలో చేసే జపం మామూలుగా చేసే దానికన్నా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు.  గ్రహణ సమయంలో ఆవు నెయ్యతో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే, ఆ మంత్రంతో హోమం చేసినంత ఫలితాన్నిస్తుంది. ఏదైనా మంత్రం అక్షర లక్షలు చేసినప్పుడు మంత్రసిధ్ధి కలుగుతుంది.  అంటే మంత్రంలో ఎన్ని అక్షరాలు వున్నాయో (ముందునుంచి వెనుకకి, వెనకనుంచి ముందుకి) అన్న లక్షలసార్లు  ఆ మంత్రాన్ని శ్రధ్ధా భక్తులతో జపిస్తే మంత్రం సిధ్ధిస్తుందంటారు. 

అయితే అందరూ ఈ జపాలు చేయలేరు.  శారీరకంగా అశక్తులు వుండవచ్చు, ఉద్యోగరీత్యా, ఇంకా ఇతర పనులవల్ల కుదరకపోవచ్చు.  అలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా వున్నాయా.  శాస్త్ర ప్రకారం సూర్య గ్రహణానికి 12 గం. ముందునుంచీ, చంద్ర గ్రహణానికి 9 గం.ల ముందునుంచీ కడుపు ఖాళీగా వుండాలి.  ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యం కలుగవచ్చు.  అందుకని ఈ జాగ్రత్త.  అలాగే గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు.  ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా కంటితో గ్రహణాన్ని చూడటం వల్ల కంట్లో ఏర్పడే దోషాలను ఏ చికిత్సతోనైనా బాగు చేయటం చాలా కష్టమని పద్మశ్రీ డా. శివారెడ్డి, ప్రసిధ్ధ కంటి వైద్య నిపుణులు,  అన్నారు. 

గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు.  ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి  వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు.  అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.

ఇంక దర్భల విషయం చూద్దాం.  ఇళ్ళల్లో శుభా శుభ కార్యాలకి వాడే దర్భలు చాలామందికి తెలిసే వుంటుంది.  గ్రహణం రోజున చాలామంది ఈ దర్బలని తాగే నీళ్ళమీదా, తినే వస్తువులమీదా, ఊరగాయలమీదా వేస్తారు.  కొందరు దీనిని ఎగతాళి చేస్తారు.  విక్రమ్ సారాబాయ్ పరిశోధనా  కేంద్రం చేసిన పరిశోధనలో గ్రహణ సమయంలో నీటి శ్రేష్టత తగ్గిపోతుందనీ, ఈ దర్భలవల్ల నీటి శ్రేష్టత పెరుగుతుందనీ కనుగొన్నారు.  వీటివల్ల మేలు జరుగుతోందని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువు చేసిన తర్వాత ఈ పధ్ధతులు పాటించటం, పాటించకపోవటం అనేది మన ఇష్టాఇష్టాలమీద ఆధారపడి వుంటుంది.  మూఢ నమ్మకాలు అని సణుక్కుంటూ ఆచరించినా తప్పులేదు...ఆ మూఢ నమ్మకాలవల్ల మనకి మేలు జరిగేటప్పుడు. 

మన పూర్వీకులు ఏ సైన్స్ ఏ పరిశోధనలు లేని కాలంలో ఎంత విజ్ఞానంతో, ఎంత దూరం ఆలోచించి, ఎన్నో తరాలదాకా ప్రజలకి మేలు చేసే విషయాలనెన్నిచెప్పారో!!!   ఆశ్చర్యంగా వుంది కదూ!!!!!

No comments:

Post a Comment