Tuesday 15 December 2020

పోలిస్వర్గం నోము- కార్తీక మాసం చివరి రోజు కథ:

 



కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏంటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పోలిస్వర్గం అచ్చం తెలుగింటి మహిళ కథ. కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ తెలుపుతుంది. పూర్వం కృష్ణాతీరంలోని ఓ ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారంట. వారందరిలోకి చిన్నకోడలే పోలి. చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. తనలాంటి మహా భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది.
ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడి వెళ్లేదు. అయితే, పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి, కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరి కంటా పడకుండా దానిపై బుట్టని బోర్లించేంది. ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ నాడు కూడా నదీస్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది.
కానీ, పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు చకచకా ముగించి, కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురై, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పవిమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె మిగతా కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు.
ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తల్చుకుంటారు. కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే.... ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు.
తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మీ రూపంగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటుంచితే, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. భగవంతుని కొలవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని ఈ కథ హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందుకే కార్తీకమాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment