Friday 30 September 2016

నవరాత్రులలో ఏ స్తోత్రాలు పారాయణ చేయాలి



లోకానికి రమణ మహర్షిని పరిచయం చేసిన వాశిష్ఠ గణపతి ముని ఉమా సహస్రం, ‘ఇంద్రాణీ సప్తశతి’ వంటి మహా గ్రంథాలను మనకు అందించారు. దేశంలోని అనిశ్చితి, అల్లకల్లోల పరిస్థితులు, అశాంతి, అరాచకాల నుంచి దేశాన్ని రక్షించమని ఆ అమ్మవారిని వేడిన శ్రీ వాశిష్ఠ గణపతి ముని రాసిన ఈ ఇంద్రాణీ సప్తశతి భారతదేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా దసరాల సందర్భంగా భారతీయులందరూ పఠించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే, దసరా 9 రోజులూ నిత్యమూ దుర్గ సప్తశ్లోకి, దుర్గా సప్తశతి, విద్యా గీత, మహిషాసుర మర్దిని స్తోత్రం, సౌందర్య లహరి, అపరాజితా స్తోత్రం, అర్గళా స్తోత్రం, దేవీ ఖడ్గమాలా స్తోత్రం, అర్జున కృత రణదుర్గా స్తోత్రం, లలితా త్రిశతి, కనకధారా స్తోత్రం, అన్నపూర్ణా స్తోత్రం, దుర్గా అష్టోత్తర శతనామావళి, బాలాత్రిపుర సుందరి అష్టోత్తర శత నామావళి, సౌందర్య లహరి, రాజరాజేశ్వరీ అష్టోత్తర శత నామావళి, విద్యాగీత, లలితా సహస్ర నామం వంటి వాటిని పారాయణ చేయడం అందరికీ శ్రేయోదాయకం. వీటిలో కనీసం ఒక్కటన్నా పారాయణ చేయడం శుభాన్నిస్తుంది.

No comments:

Post a Comment