Saturday 31 December 2016

కేలండర్

 


తెలుగు కేలండర్ ని పంచాంగం అంటారు. తిథి,వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు(విషయాలు) పంచాంగంలో ఉంటాయి.మనకి తెలసిన  కేలండర్  కీ, పంచాంగానికీ నక్క కీ ,నాగలోకానికీ ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అవి డేట్స్ మాత్రమే చెప్తాయి. పంచాంగం అలా కాదు. సూర్య చంద్రాది గ్రహ గతులు అపార వైదిక గణిత శాస్త్రంతో విడమర్చి చెప్తాయి. పౌర్ణమి ఎప్పుడు?సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుదేర్పడతాయి? ఇలాంటి మహత్తరమైన కాలపు లెక్కలు మన పంచాంగంలో ఉంటాయి. ఇవన్నీ మనం ఈ రోజు చూస్తున్న కేలండర్ కి చాలాచాలా వేల సంవత్సరాలకి ముందే మన భారతీయులు సాధించిన ఖగోళ గణిత విజ్ఞానం. 


మనం పుట్టిన వేళని బట్టి, అప్పుడున్న గ్రహగతుల్ని బట్టి ఎప్పుడు మంచి జరుగుతుందో, ఎప్పుడు బాధలోస్తాయో లెక్కలు గట్టి…. దానికి రెమెడీలు చెబుతారు. అంటే, చీకటి పడుతుంటే మనం అలా చీకట్లో బాధపడకుండా కొవ్వొత్తో, లాంతరో, లైటో వాడతాం!  ఫలానా పూజలు చెయ్యి, ఫలానా జపాలు చెయ్యి, ఫలానా దానాలు చెయ్యి-అని కొవ్వొత్తులూ, లాంతర్లూ వాడడం లాగా –పరిహారాలను చెప్పేదే పంచాంగం. 


మనకీ నెల్లో బాగుందనీ అదృష్టం వేరిస్తుందని, మనకీ నెల్లో నష్టం జరగవచ్చుననీ కష్తం వస్తుందని కేలండర్లు చెప్పలేవు. కానీ పంచాంగం ఈ విషయాలన్నింటిని  చెబుతుంది. అలాంటి మంచి మాటలూ, మంచి రోజులూ చెబుతుంది. గనుకనే పంచాంగాన్ని ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనంగౌరవిస్తున్నాం,పాటిస్తున్నాం.


భవిష్యత్తును సైతం అంచనా వేయగల మేధావులు మన పంచాంగకర్తలు .ప్రపంచంలో  ఖగోళ పరిజ్ఞానం  అతి ప్రాచీన కాలం నుండీ  మన హైందవసంస్కృతి లో ఉంది. శాస్ర్తీయమైన యతార్థ విజ్ఞానాన్ని తెలుసుకోకుండా, పాశ్చాత్య సాంప్రదాయాలపై నేడు మన హిందూ యువత మోజు చూపుతోంది. అందరు అనుసరించిన, అనుసరించవలసిన అసలు కాలమానం ఏది? ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ కాలమానంలో లోపాలు ఏంటి? 

ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి "ఖగోళమే" ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం.కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరం. పుష్కరం, శకం, యుగం కల్పకం మొదలైన అన్నింటినీ ప్రాచీన కాలం నుంచి హిందువులు ఖగోళ శాస్ర్త ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు.విశ్వం లోని అంశాలైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మొదలైన వాటి స్థితి గతుల్ని వివరించే శాస్ర్తమే ఖగోళశాస్ర్తం. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్ర్త పరిజ్ఞానం అత్యంత ముఖ్యం. భూమి వాతావరణానికి అవతల వ్యాపించి ఉన్న అనంత విశ్వాన్ని అంతరిక్షం అంటారు. గ్రహతారకాదులతో కూడి ఉన్న ఈ అంతరిక్ష పరిధినే ఖగోళం అని వ్యవహరిస్తారు. భూమి ఒక ఆత్మ ప్రదక్షిణం చేస్తే 1 రోజు అనీ, చంద్రుడు ఒక భూ ప్రదక్షిణ చేస్తే 1 నెల అని, భూమి ఒక సూర్య ప్రదక్షిణం చేస్తే 1 సంవత్సరం అనీ...ఇలా కాలమానాన్ని ఖగోళ విషయ ఆధారంగానే ఉండి తీరాలనేది  నియమం.


సంవత్సరం అనేది కాలమానంలో ఒక అంశం. నక్షత్రాల, గ్రహాల ఉనికీ సంవత్సర ఆరంభానికి ఖచ్చితంగా ఒక ఖగోళ ప్రత్యేకత అంటూ ఉండి తీరాలి. ఏ ఖగోళ పత్ర్యేకతా . ఆధారమూ లేకుండా ఎవరికో తోచిన జనవరి ఫస్ట్ ను సంవత్సరారంభంగా అంగీకరించి అనుసరించడం సరికాదు.మనం పాటించాల్సిన యదార్థ సంవత్సరారంభం ఉగాది.
క్రీస్తు శకాన్ని ఉపయోగిస్తూ కాలాన్ని లెక్కిచండం ఎందుకొచ్చింది? అందరూ క్రీస్తు శకాన్నే వాడడంలో ఏమైనా ప్రముఖ విశేషం ఉందా?

చరిత్రలో ఎప్పుడు ఏ సంఘటన జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి సంవత్సరాలను వరుసగా లెక్కించుకుంటూ రావడం అవసరమైంది. అయితే ఈ లెక్కకు ఎక్కడ నుంచి మొదలైందని చెప్పడం కష్టమే. పురాణ పురుషుల కాలం నుంచో.. మహా ప్రతిభావంతులైన చక్రవర్తుల కాలం నుంచో, ప్రవక్తల కాలం నుంచో... ఏదైనా గొప్ప సంఘటన జరిగిన నాటి నుంచో- సంవత్సరాలను లెక్క పెట్టడం చరిత్రలో ఒక రివాజు. దీనినే శకం లెక్కింపు అంటారు. 

ఒక్కొక్క జాతి ఒక్కొక్క కాలంలో తమ శకాలను ప్రారంభించుకుంది. మన హిందూజాతికి అతి పురాతన కాలం నుంచీ అనేక శకాలున్నాయి. కలిశకం, విక్రమశకం, శాలివాహన శకం మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం కలిశకం లెక్క ఆచరణలో ఉంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో అలవాటు చేయబడిన క్రీస్తు శకం కాలమానాన్ని ప్రపంచరీతి కోసం నేటికీ మనం అనుసరిస్తున్నాం.

 నేడు ప్రపంచంలో క్రైస్తవాన్ని ఆదరించే దేశాల ప్రాబల్యంతో ఏసు క్రీస్తు శకాన్ని ఉమ్మడి శకంగా తీసుకోవాల్సివచ్చింది. అంతేగానీ ఈ శకాల కంటే క్రీస్తు శకానికి ఏదో ప్రత్యేకత ఉందని మాత్రం కాదు.
వివిధ దేశాల ప్రజలు వివిధ కాలమానాలతో జీవనాలు సాగించేవారు. ఎవరి లెక్కలు వారికుండేవి. తమకు తెలియని విషయాన్ని, మరో జాతి నుంచి నేర్చుకునేవారు. అయితే కాలం గడిచేకొలదీ...ప్రపంచమంతా ఒకే కాలమాన పద్ధతిని అనుసరిస్తే బావుంటుందనే భావన మొదలయ్యింది. అయితే ఎవరి కాలమానాన్ని...ఈ ప్రపంచ కాలమానంగా తీసుకోవాలనే సమస్య వచ్చింది. ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రపంచంలో అనేక ప్రాంతాలు బ్రిటీష్ వారి ఆక్రమణలో ఉన్నాయి. దీంతో బ్రిటీష్ వారు తాము స్వీకరించిన క్రీస్తు శకం అనే కాలమానాన్ని బలాతిశయంతో ప్రముఖంగా ముందుకు తీసుకువచ్చారు. తమ ఆధీనంలోని అన్ని దేశాలలో ఈ శకాన్ని అమలుపర్చడం మొదలు పెట్టారు. ఈ విధంగా ప్రపంచలోని అనేక దేశాల్లో క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఆ తర్వాత మిగిలిన దేశాలు తమ సౌలభ్యం కోసం క్రీస్తు శక కాలమానాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది.
అయితే క్రీస్తు శకంలో ఓ తిరకాసు ఉంది. ఏసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడనే విషయాన్ని చరిత్రకారులెవరు కూడా ఒక నిర్థారణగా ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. క్రీస్తు జీవితానికి సంబంధించిన ఏ చారిత్రక ఆధారమూ కన్పించడం లేదని విదేశీ చరిత్రకారులు తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు హెచ్. జివెల్స్ తన ప్రపంచ చరిత్ర గ్రంథంలో క్రీస్తు జీవితానికి సంబంధించిన ఆధారాలు లభించడం లేదని తెలిపారు. బైబిల్ కూడా క్రీస్తు అనంతరం రాయబడింది.
చాలా మంది క్రీస్తు పుట్టుక నుంచే క్రీస్తు శకం మొదలైందని అనేకమంది భావిస్తారు. ఏసు క్రీస్తు జీవించాడానికి చెప్పబడుతున్న కాలానికి కొన్ని శతాబ్దాల తర్వాత క్రీ.శ. 532వ సంవత్సరంలో డయోనీషియన్ ఎక్సీగస్ అనే రోమన్ సన్యాసి, క్రీస్తు పేరుతో ఒక శకాన్ని ప్రారంభించాలంటూ ప్రచారం మొదలు పెట్టాడట..! క్రీస్తు పుట్టిన సంవత్సరం క్రీ.శ.1అని ఆయన ప్రతిపాదించాడు. అయితే చాలా కాలం వరకూ ఈ క్రీస్తు శకం అనే అంశాన్ని ఎవరూ అంగీకరించలేదు. క్రీ.శ.816లో చల్సా బిషప్ ల మహాసభ క్రీస్తు శకాన్ని వాడకంలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చింది. అయినా కూడా చాలా సంవత్సరాలు ఎవరూ పట్టించుకోలేదు. క్రీ.శ.879 లో జర్మనీ చక్రవర్తి 2వ ఛార్లెస్ మొట్టమొదటగా క్రీస్తు శకాన్ని అమలులో పెట్టాడట. అనంతర కాలక్రమంలో ఇతర చోట్ల మెల్లమెల్లగా క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఇది క్రీస్తు శకం అసలు చరిత్ర.! అంటే క్రీస్తు జీవితానంతరం సుమారుగా 800 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం అమలులోకి వచ్చిందన్నమాట. అయితే క్రీస్తు పుట్టింది. క్రీ.శ.1 లో కాదనీ , క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అయి ఉండవచ్చుననీ సుప్రసిద్ధ చరిత్రకారుడు సర్ జాన్ కెప్లర్ తేట్చాడని కొంతమంది చెబుతారు. అయినా కూడా క్రీస్తు శకం లెక్కను మాత్రం ఎవరూ మార్చలేదు. అలాగే వదిలేశారు. ఇది అలాగానే కొనసాగుతోంది.
అమెరికాకు చెందిన చరిత్రకారుడు విల్ డ్యూరాంట్...క్రీస్తు గత చరిత్రపై పరిశోధన చేశాడు. డిసెంబర్ 25న క్రిస్ మస్ పండుగపై కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. క్రీ.స్తు పుట్టిన సంవత్సరాన్ని చరిత్రకారులు బయటపెట్టలేకపోయాడు. ఆయన పుట్టిన నెల, తేదీలను నిర్ణయించగల అవకాశాలు చరిత్రలో ఎక్కడ కనిపించలేదని...దీంతో ఆ కాలాన రోమ్ నగరంలో ప్రతియేటా డిసెంబర్ 25వ తేదీన శాటర్నేలియా అనే పండుగ వేలాది మందితో తిరునాళ్ల వలే జరుపుకునేవారు. ఇది క్రైస్తవ మత ప్రచారానికి అనుకులంగా ఉంటుందని భావించిన ఎక్సీగస్ ఇదే రోజును క్రీస్తు జన్మదినంగా ప్రచారం చేసేవాడట..! కాలక్రమేణ ఆ ప్రచారం ముదిరి క్రీ.శ.1020 నాటికి డిసెంబర్ 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు జన్మదినంగా అనేక చోట్ల స్థిరపడింది.


.క్రీస్తు శకం వాడకం ఒక ఆధారమంటూ లేకుండా కొనసాగుతున్న ఆచారం..! వసంత ఋతువులో సంత్సరాదిని ఏర్పాటు చేసుకోవడం ఖగోళపరంగా ఖచ్చితమైన పద్ధతి. కాలమానంలో సుక్ష్మఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు...మొదలైనవి ఏర్పరచిన అతి ప్రాచీన కాలమానం మనది. ఇవన్నీ కూడా ఖగోళ ఆధారంగానే ఏర్పరచడం జరిగింది. విదేశీ కాల్యెండర్ లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ తేదీల్ని అంకెల్లో లెక్కించుకోవడం తప్ప... ఏ తేదీన ఖగోళ పరిస్థితి ఎలా ఉన్నది తెలిపే విధానం ఏదీ లేదు. కానీ అదే మన హిందూ పంచాంగంలో ఖగోళ పరిస్థితి తెలిపే విధానం ఉంది.తెలుగు వాళ్ళందరం దానినే అనుసరిద్దాం.


No comments:

Post a Comment