Wednesday 7 November 2018

నేటి దిన విశేషం_ 8-11-2018


*నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం..!*
శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం.
ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు.
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఈ మాసంలో..
పాఢ్యమి,
చవితి,
పౌర్ణమి,
చతుర్దశి,
ఏకాదశి,
ద్వాదశి
తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.
హరిహరాదులకు ప్రీతికరం..కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే!
అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది.
దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు,
రుద్రపూజ,
లక్ష బిల్వదళాలతో పూజలు,
అమ్మవారికి లక్షకుంకుమార్చనలు,
విశేషంగా జరుపుతూ ఉంటారు.
అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు.
కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.
ఉపవాసం,
స్నానం,
దానం
మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.
విష్ణువును..
తులసి దళాలు,
మల్లె ,
కమలం,
జాజి,
అవిసెపువ్వు,
గరిక,
దర్బలతోను
శివుని..
బిల్వ దళాలతోనూ,
జిల్లేడు పూలతోనూ
అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి.
శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి,
రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు.
పాలు పళ్ళు తీసుకోవచ్చు.
నారాయణ స్వామి వ్రతం,
కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.
*ఇవి చేస్తే మంచిది:*

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.
అయితే అలా రోజు చేయలేని వారు కనీసం..
ఏకాదశి,
ద్వాదశి,
పూర్ణిమ,
సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ,
సోమవారంరోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి,
గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు.
కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి.. శివాలయంలో రుద్రాభిషేం చేయిస్తే..
సమస్త పాపాలు భస్మీపటలమై..
ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి..
అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని
కార్తీక పురాణంలోని అనేక గాథలు,
ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.
*ఇవి చేయరాదు:*
తామనం కలిగించే ఉల్లి,
వెల్లుల్లి,
మద్యం,
మాంసం
జోలికి పోరాదు.
ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.
పాపపు ఆలోచనలు చేయకూడదు.
దైవ దూషణ తగదు.
దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్ర అవసరాలకు ఉపయోగించరాదు.
మినుములు తినకూడదు.
నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.
కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.
కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన..
గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి.
స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి.
మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.
ఓం నమః శివాయ..

No comments:

Post a Comment