Thursday 7 December 2017

యజ్ఞాల్లో, పూజల్లో ఆవుపాలునే ఎందుకు వాడతారు.......?


పూజాకార్యక్రమాలు, వ్రతాలు, యజ్ఞాల్లో ఆవు పాలునే ఎందుకు వాడుతారని తెలుసుకోవాలనుందా అయితే ఈ కథనం చదవండి. గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైంది. సకల దేవతలకి గోమాత నివాస స్థలం.
ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని పండితులు చెబుతున్నారు.
" సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం "
శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటి దానివని, ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయం గోమాతని, అందుచేతనే ఆవుపాలును శ్రేష్ఠమైందని చెబుతారు.

No comments:

Post a Comment