Saturday 2 December 2017

డిసెంబర్ 3 పౌర్ణమినాడు చెయ్యాల్సిన యోగ క్షేమం :(దత్తాత్రేయ జయంతి)

ఈరోజు అందరు కూడా వీలయినంత భక్తి శ్రద్ధతో ఈ యోగ క్షేమాన్ని చేసి సకల శుభాలను పొందండి.ఈరోజంత కూడా ఎవరికీ వీలయిన వేళలో వాళ్ళు చెయ్య వచ్చు.

ఈ రోజీ దత్తజయంతి  కాబట్టి  ఈ మార్గశిర పౌనమి నాడు దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించి తెల్లని పుష్పాలను సమర్పించి  అక్కడే ఆలయం లో కూర్చునే వీలున్నవాళ్ళు అక్కడే కూర్చుని లేదా వీలు లేని వాళ్ళు ఇంట్లో ఈ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించండి.
జపించాల్సిన మంత్రం 
"ఓం శ్రీ కాలాగ్ని శమనాయ నమః శ్రీ  దత్త శరణం మమ"
ఈ మంత్రాన్ని జపించడం తోపాటు నానబెట్టిన శనగలు  లేదా నానబెట్టే సమయం లేని వాళ్ళు పుట్నాలనైన సరే ఆవుకి సమర్పించాలి  మరియు బెల్లం కలిపి చేసిన రొట్టెలను నాలుగు కుక్కలకి సమర్పించాలీ.
మేడి చెట్టుకి తోచినంత ప్రదక్షిణాలు చేసి ఒక మేడి ఆకుని దత్త స్వరూపంగా భావించి తెచ్చి మీ దగ్గర ఉంచుకోవాలి.
కాలంతో వచ్చే అన్ని అరిష్టాలు తొలగించబడి శుభాలు వస్తాయి.

శుభమస్తు..



No comments:

Post a Comment