Friday 4 January 2019

వైజయంతి మాల


వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి.వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.
వైజయంతి మాల లక్ష్మీదేవి స్వరూపంగా దీపావళి రోజు పూజ చేసి బీరువాలోగానీ,మెడకు గాని ధరించవచ్చును. వైజయంతి మాలను దీపావళి రోజు గాని,శుక్రవారం రోజుగాని లక్ష్మీదేవి పటానికి గాని,శ్రీచక్రమేరువుకి గాని అలంకరించి లలితా సహస్త్రనామంతో గాని,లక్ష్మీ అష్టోత్తరంతో గాని కుంకుమార్చన చేసి వైజయంతీ మాలను మెడకు దరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
వైజయంతిమాలను లక్ష్మీ దేవి అలంకరణలో గాని,పూజలో గాని తప్పనిసరిగా ఉపయోగించాలి.
వైజయంతిమాలను వివాహం కానివారు నిత్యకళ్యాణం జరిగే దేవాలయంలో ఈ మాలను ధరించి కళ్యాణం చేపించుకున్న యెడల వారికి సత్వర వివాహం జరుగుతుంది.వైజయంతిమాలను దరించి రుక్మిణీ కళ్యాణం ఇంటిలోగానీ,దేవాలయంలో గాని చేపించుకొన్న వివాహ సంబంద ఆటంకాలు తొలగిపోతాయి
వైజయంతిమాలను వ్యాపార సంస్ధలలోని పూజ మందిరంలో దేవుడి పటాలకు,విగ్రహాలకు అలంకరించిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది.
జాతకచక్రంలో శుక్రగ్రహ దోషాలు,సప్తమభావ దోషాలు ఉన్నవారు వైజయంతిమాలను ధరించటం మంచిది. వైజయంతిమాలను దరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది.
contact ph no: 9000123129

No comments:

Post a Comment